ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం స్థానిక కేతనకొండ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నేడు స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని మైలవరం కాపు సేవా సమితి అధ్యక్షులు పయ్యావుల రాము ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అనునిత్యం ప్రజల సమస్యలను తీరుస్తూ పాటుపడుతున్న వ్యక్తి కరోనా మహమ్మారి బారినపడటం చాలా బాధాకరమని, ఆయన త్వరగా కోలుకొని ప్రజలకు సేవచేసే భాగ్యం ని ఆ భగవంతుడు కల్పించాలని ఆయన కోరారు.
Prajavartha Online Telugu News