Breaking News

ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఈ గేట్ వే…

-నీటి తీరువా చెల్లింపు లకు సరళీకృత విధానం
-ఆర్డీవో ఎస్. మల్లిబాబు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు నీటితీరువా చెల్లించే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకుని రావడం జరిగిందని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో వివరాలు తెలుపుతూ, గతంలో రైతుల నుంచి నీటి తీరువా పన్నులు వసూళ్ళ కోసం విఆర్వో లు, విఆర్ఏ లు ఇంటి వద్దకు వొస్తేనే కానీ పన్నులు రైతులు చెల్లించేవారు కాదన్నారు. నీటి తీరువా పన్నులు సకాలంలో చెల్లించక పోవడంతో ఎంజెయ్మెంట్ కు, గుర్తింపు కి ఇబ్బందులు పడుతున్నారని తెలిసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సరళీకృత విధానం అమలుకు చర్యలు చేపట్టారని ఆర్డీవో తెలిపారు. కరెంట్, టెలిఫోన్ బిల్లులు ఏ విధంగా చెల్లించుతారో, ఆ తరహా లో కిస్తీ చెల్లించవలసిన సమయానికి గ్రామ వాలంటీర్ మీ ఇంటికి నీటితీరువా డిమాండ్ నోటీస్ అందచేయ్యడం జరుగు తుందన్నారు. “ఇ- గేట్ వే ” ద్వారా మీరు ఎంత నీటి తీరువా చెల్లించలో ఆ డిమాండ్ నోటీసు ద్వారా తెలియచేస్తారని ఆర్డీవో మల్లిబాబు తెలిపారు. నీటితీరువా పన్ను మొతాన్ని రైతులు ఇంటి నుంచే ఆన్లైన్ లోగాని, సచివాలయంలో గానీ చెల్లించాలని కోరారు. తద్వారా మీ భూములపై హక్కుని, స్వాధినతనీ నిరూపించుకుని, సర్వహక్కులు పొందగలరని మల్లిబాబు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *