జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుంది…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి స్థానిక ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించారు. అక్కడున్న వసతులను పరిశీలించిన అనంతరం ఖైదీలతో మాట్లాడారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించడానికి, క్షణికావేశంలో చేసిన నేరాల వల్ల జీవితంలో విలువైన వాటిని ఎలా కోల్పోతారని, కుటుంబ బాంధవ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయో వారికి వివరించారు. న్యాయ మార్గంలో జీవించడం వల్ల గౌరవంతో పాటు ఇతరులకు నష్టం వాటిల్లే పరిస్థితులు రావని వారికి చెప్పారు. పరివర్తన చెంది మంచి మనుషులుగా, బాధ్యత గల పౌరులుగా మారాలని అన్నారు. న్యాయ పరమైన సమస్యలు, సందేహాలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక మహిళా జైల్ పర్యవేక్షకురాలు సిహెచ్. వసంత కుమారి, డా. విజయ లక్ష్మి , మహిళా ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

లిథియం, గాలియం నిక్షేపాల అన్వేషణపై ఎన్జీఆర్ఐతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ

-ఐఐటీ(ఐఎస్‌ఎం) ధన్‌బాద్‌తో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కీలక ఖనిజాల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *