Breaking News

రీ సర్వే కిట్ లను పంపిణీ చేసిన కలెక్టర్ వెంకట రమణారెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మొదటి విడతగా 200 గ్రామాలకు చెందిన విలేజ్ సర్వేయర్లకు/ వీఆర్వోలకు క్షేత్రస్థాయిలో సర్వే చేయుటకు వినియోగించే కిట్లను జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి జెసి డికే బాలాజీ, ఆర్డీఓ కనక నరస రెడ్డి, జిల్లా సర్వే అధికారి జయరాజ్ తో కలసి రీసర్వే కిట్లను విలేజ్ సర్వేయర్లు/ వీఆర్వో లకు పంపిణీ చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్లో రీ సర్వే కిట్లని పంపిణీ చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ కిట్ లో రీ సర్వే కు ఉపయోగపడే సుమారు 2500 రూపాయల విలువచేసే ఉపకరణాలు బ్యాగు, మెడికల్ కిట్టు, బూట్లు, వాటర్ బాటిల్, పెన్ను, పెన్సిల్, బుక్ తదితరాలు మొదటి విడతగా 200 మంది కి పంపిణీ చేస్తున్నామని వీటిని రీ సర్వే విధులకు హాజరయ్యే విలేజ్ సర్వేయర్లు వీఆర్వోల సౌకర్యార్థం వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. రీ సర్వే పూర్తి అయిన భూములలో హద్దురాళ్ళను నాటడం వేగవంతం చేయాలని సర్వే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సంబంధిత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఫొటోగ్రఫీ పోటీల్లో భాగస్వామ్యం అభినందనీయం

-మూడు విభాగాల్లో 27 ఉత్తమ ఛాయాచిత్రాల ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుల -ఆగస్టు 19 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *