విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బెలగావి (కర్ణాటక), శంషాబాద్ (తెలంగాణ), బారామతి (మహారాష్ట్ర), కిషన్గఢ్, అజ్మీర్ (రాజస్థాన్), బాలాసోర్ (ఒడిశా), కర్నూలు (ఆంధ్రప్రదేశ్) మరియు గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లలో ESIC కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన భూపేందర్ యాదవ్
‘యాక్ట్ ఈస్ట్’ కోసం ప్రధాన మంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపును ముందుకు తీసుకెళ్తూ ఈశాన్య రాష్ట్రాలు మరియు సిక్కింలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కొనసాగించడానికి ESI పథకాన్ని ESIC అమలు చేయనుంది: యాదవ్
ఈరోజు చండీగఢ్లో జరిగిన ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) 190వ సమావేశానికి కేంద్ర కార్మిక & ఉపాధి మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి కార్మిక & ఉపాధి, పెట్రోలియం & సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్తేలి కూడా హాజరయ్యారు. ESI కార్పొరేషన్ యొక్క 190వ సమావేశంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను మరింతగా పెంచుతూ, శ్రమ జీవులకు సామాజిక భద్రతను బలోపేతం చేయడంపై యాదవ్ అనేక నిర్ణయాలను ప్రకటించారు.
కార్మికుల సంఖ్య పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న ఈఎస్ఐ కార్పొరేషన్, బెలగావి (కర్ణాటక), శంషాబాద్ (తెలంగాణ), బారామతి (మహారాష్ట్ర), కిషన్గఢ్, అజ్మీర్ (రాజస్థాన్) మరియు బాలాసోర్ (ఒడిశా) లలో 100 పడకల ఆసుపత్రులు, కర్నూలు (ఆంధ్రప్రదేశ్)లో 30 పడకల ESI హాస్పిటల్ మరియు గ్రేటర్ నోయిడా (ఉత్తర ప్రదేశ్)లో 350 పడకల ESI హాస్పిటల్ ఏర్పాటుకు గల ప్రతిపాదనలను ఈ సమావేశంలో ఆమోదించింది.
వీటితో పాటు, సిక్కింలోని రంగ్పోలో కొత్తగా ఆమోదించిన 30 పడకల ఇఎస్ఐసి ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేయాలని సూచించారు. అలాగే గుణదల, విజయవాడ (ఆంధ్రప్రదేశ్) మరియు మైథాన్, రాంచీ (జార్ఖండ్)లలో ఇఎస్ఐఎస్ హాస్పిటల్ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్వాధీనం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వాలు. కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం మరియు సౌకర్యాలను అందించడానికి కొత్తగా స్వాధీనం చేసుకున్న ఆసుపత్రులను ఇక పై నేరుగా ESIC నిర్వహిస్తుంది.
తక్కువ జనాభా ఉన్న ఈశాన్య ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులు/డిస్పెన్సరీలు/నర్సింగ్ హోమ్ల కొరత మరియు ఈశాన్య రాష్ట్రాల్లో ESI పథకం యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని, ఈశాన్య రాష్ట్రాలు & సిక్కింలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం అక్కడ ESI పథకం కొనసాగించాలని ESIC నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం 2023-24 నుంచి ఇక్కడ అయ్యే మొత్తం ఖర్చు చాలా వరకు ఈశాన్య రాష్ట్రాలకు (అస్సాం మినహా) ESI కార్పొరేషన్ ద్వారా భరిస్తుంది.
ఇంకా, అదనపు ఆర్థిక సహాయం కింద ఒక్కో డిస్పెన్సరీకి రూ. 40 లక్షలు (త్రైమాసికానికి రూ. 10 లక్షల రూపాయలు) రాష్ట్ర ప్రభుత్వానికి అందించడ కూడా ప్రారంభిస్తారు. స్టాండర్డ్ మెడికల్ కేర్ కింద రెగ్యులర్ ఫండ్ కేటాయింపు కాకుండా ఇది ఒక అదనపు ప్రయోజనం అని చెప్పచ్చు. ప్రస్తుత సూచనల ప్రకారం కొత్త డిస్పెన్సరీలను తెరిచినా సరే.. ఇది అందుబాటులో ఉంటుంది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో నిరుద్యోగులుగా మారిన బీమా కార్మికులకు ఉపశమనం కల్పించేందుకు, అటల్ బీమిట్ వ్యక్తి కల్యాణ్ యోజన కింద లభించే ప్రయోజనాలను మరో రెండేళ్లపాటు పొడిగించే ప్రతిపాదనకు ఈ సమావేశంలో ESI కార్పొరేషన్ అంగీకరించింది. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ABVKY) అనేది ఆకస్మిక నిరుద్యోగ సమయంలో కార్మికుల జీవితకాలంలో ఒకసారి 90 రోజుల వరకు నగదు పరిహారం రూపంలో వారికి సహాయపడే ఒక సంక్షేమ చర్య.
సామాజిక భద్రతా కోడ్ – 2020 అమలు తర్వాత ESI పథకం పరిధిలోకి వచ్చే బీమా పొందిన కార్మికులు మరియు వారిపై ఆధారపడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ముందుగానే ఊహించి IPలు మరియు వారి లబ్ధిదారులకు ప్రాథమిక వైద్య సంరక్షణ అందించడం కోసం బహుముఖ వ్యూహాలను అనుసరించడం ద్వారా వైద్య సేవల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మరియు విస్తరించడంపై దృష్టి పెట్టాలని శ్రీ భూపేందర్ యాదవ్ ESIC ని ఆదేశించారు.
31.03.2024 వరకు ESIC హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్, అల్వార్ (రాజస్థాన్) మరియు బిహ్తా (బీహార్)లలో వైద్య సంరక్షణ సౌకర్యాలను సాధారణ ప్రజలకు ఉచితంగా పొడిగించే ప్రతిపాదనను ESIC ఆమోదించింది. ESIC కింద మందులు/డ్రెసింగ్లు మరియు వినియోగ వస్తువుల సౌకర్యాలు కూడా వారికి ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇది పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది సామాన్య ప్రజలకు ఎటువంటి అవాంతరాలు లేని నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందే విధంగా చక్కని ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
ఇవి కాకుండా, 2022-23 సంవత్సరానికి ESI కార్పొరేషన్ యొక్క సవరించిన అంచనాలు, 2023-24 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు మరియు 2023-24 సంవత్సరానికి పనితీరు బడ్జెట్ ఇతర ఎజెండా అంశాలతో పాటు చర్చించడం మరియు ఆమోదించడం కూడా జరిగింది.
కేంద్ర కార్మిక మంత్రి అధ్యక్షతన జోనల్ మెడికల్ కమిషనర్లు, మెడికల్ కమిషనర్లు, ఇన్సూరెన్స్ కమిషనర్లు మరియు ESIC ప్రాంతీయ డైరెక్టర్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో, రిఫరల్ సిస్టమ్లో సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో వనరులను సరైన రీతిలో ఉపయోగించడం, చేరుకోని వారికి ఈ సౌకర్యాలను అందేలా చేయడం వంటి అంశాలు (అసంఘటిత రంగ కార్మికులు) మరియు వృత్తిపరమైన వ్యాధుల గురించి చర్చించారు. అలాగే తీసుకోవాల్సిన చర్యలను కూడా గుర్తించారు.
ఈ సమావేశంలో ఎంపి డోలా సేన్, ఎంపి ఖగెన్ముర్ము, ఎంపి, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆర్తి అహుజా మరియు ఇఎస్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలు, యాజమాన్యాల ప్రతినిధులు, ఉద్యోగులు, వైద్య రంగ నిపుణులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిష్కరించాలి..
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును …
Prajavartha Online Telugu News