-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి కృష్ణలంక ప్రాంతములో గల అంబేద్కర్ పార్క్ ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించుటతో పాటుగా నిరూపయోగంగా ఉన్న రోప్ వే ను పరిశీలించి దానికి అవసరమైన తగిన మరమ్మత్తులను చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పార్క్ నందు స్థానిక ప్రజలకు వినియోగపడే విధంగా సైకిల్ ట్రాక్ మరియు వాకింగ్ ట్రాక్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కే.వి సత్యవతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News