Breaking News

మౌలానా నేషనల్‌ ఫెలోషిప్‌ను పునరుద్ధరించాలి… : జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్తి గ్రామంలోని శాంతిపాలెంలో సుబాని ఆధ్వర్యంలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్‌సిపి మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ పాల్గొని అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ భారతరత్న పురస్కార గ్రహీత, స్వతంత్ర భారత తొలి విద్యామంత్రిగా ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధికి అబుల్‌ కలాం ఆజాద్‌ విశేష కృషి చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా ప్రారంభించిన మౌలానా నేషనల్‌ ఫెలోషిప్‌ మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో తోడ్పడేదన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీనిని రద్దు చేయడంతో ముస్లింలు, అన్ని మైనార్టీలవర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు మౌలానా నేషనల్‌ ఫెలోషిప్‌ పథకాన్ని పునరుద్ధరించేలా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అధికార ప్రతిపక్ష నేతలను కోరారు. ఈ కార్యక్రమంలో సుభాని, బాజ్‌మూన్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గన్నవరం వ్యాక్సిన్‌ కోల్డ్‌చైన్‌ అధికారి దేవానందం సస్పెన్షన్‌

-మహిళా అధికారులపై అనుచిత వ్యాఖ్యల ఫలితం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం స్టేట్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌లో కోల్డ్‌చైన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *