రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్ర్య సమర పోరాట సమయంలో ఆనాటి దేశ నాటక రంగ కళాకారులు పోషించిన పాత్ర తనదైన ముద్ర వేసిందని, అటువంటి కళలను భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) రిజిస్టర్ డాక్టర్, జ్యోల ప్రసాద్ అన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) తన ప్రాంతీయ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో స్థాపించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను ప్రదర్శించడానికి రాజమహేంద్రవరం వేదికగా 22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్). నిర్వహిస్తున్నామన్నారు.
నాటక ప్రదర్శన అనంతరం స్మశాన కురుక్షేత్రం పాత్ర దారుల నటనా ప్రతిభను ఆయన అభినందించి మేమొంటో లను అందచేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మహాభారత ఐతే, కురుక్షేత్రం అనంతరం ఇతివృత్తం కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అద్భుతంగా ప్రదర్శించారని అన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నిర్వహించే ఫెస్టివల్ ఇన్చార్జి డైరెక్టర్ పి వెట్రి భూపతి బెంగళూరు ఎన్ఎస్డి సెంటర్ డైరెక్టర్ వీణ శర్మ పాల్గొన్నారు.
భారత్ రంగ్ మహోత్సవ్ -2023 లో భాగంగా నాల్గవ రోజు స్మశాన వాటిక కన్నడ నాటక ప్రదర్శన అనంతరం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) రిజిస్టర్ డాక్టర్, జ్యోల ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమర పోరాట సమయంలో ఆనాటి దేశ నాటక రంగ కళాకారులు పోషించిన పాత్ర తనదైన ముద్ర వేసిందని, అటువంటి కళలను భవిష్యత్తు తరాలకు అందించటానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాల్సి ఉంటుం దన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) తన ప్రాంతీయ కేంద్రాన్ని రాజమహేంద్రవరంలో స్థాపించడానికి ముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కళాకారులకు ప్రపంచ స్థాయి నాటకరంగ ప్రదర్శనలను ప్రదర్శించడానికి రాజమహేంద్రవరం వేదికగా 22వ భారత్ రంగ్ మహోత్సవ్ 2023 (థియేటర్ ఫెస్టివల్) నిర్వహిస్తున్నామన్నారు. నాటక ప్రదర్శన అనంతరం స్మశాన కురుక్షేత్రం పాత్ర దారుల నటనా ప్రతిభను ఆయన అభినందించి మేమొంటో లను అందచేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మహాభారత ఐతే, కురుక్షేత్రం అనంతరం ఇతివృత్తం కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం అద్భుతంగా ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో నిర్వహించే ఫెస్టివల్ ఇన్చార్జి డైరెక్టర్ పి వెట్రి భూపతి బెంగళూరు ఎన్ఎస్డి సెంటర్ డైరెక్టర్ వీణ శర్మ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News