విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి లో అగ్రగమిగా నిలిపి సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో మిగతా ముఖ్యమంత్రిలకు రోల్ మోడల్ గా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 21వ డివిజన్ 105వ సచివాలయం పరిధిలోని కృష్ణలంక పాతగుడ్ల బజార్,నిమ్మలవారి స్ట్రీట్,మంటాడా రావమ్మా స్ట్రీట్ ప్రాంతాలలో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ఈ మూడేళ్ళలో ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారంలోకి వచ్చిన కేవలం మూడేళ్ళ కాలంలోనే 98 శాతం పైగా హామీలను అమలు చేసిన ఘనత జగన్ గారిదే అని,మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు కొండంత భరోసా ఇస్తున్నారు అని తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను స్వయంగా చూసి రూపొందించిన మెనిఫెస్టో ని పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థ లను ప్రవేశపెట్టి గడప వద్దకే అర్హతే ప్రామాణికంగా సంక్షేమ లబ్ది అందజేస్తున్నారని అన్నారు.నేడు మా పర్యటనలో ప్రతి ఇంటికి వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా మేము జెండా మోసి కష్టపడిన సరే నాడు మాకు ఎలాంటి పధకాలు రాలేదు కానీ నేడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మా ఇంట్లో ముసలివాళ్ళకి పెన్షన్,అమ్మఒడి,చేయూత లాంటి పధకాలు వస్తున్నాయి అని చెబుతుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. అర్హత ఉండి ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకాలు అమలు కాకపోతే మా ఈ పర్యటన లో అర్జీలు అందిస్తే సంబంధిత సచివాలయ సిబ్బంది తక్షణమే మంజూరు అయ్యేలా తగు చర్యలు తీసుకొంటారని భరోసా ఇచ్చారు. ఒకవైపు జనరంజక పరిపాలన అందిస్తూ జగన్ గారు ప్రజల మనసులో కొలువై ఉంటే,మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు..అందుకే వైస్సార్సీపీ నాయకులు వస్తుంటే ప్రజలు మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు పుప్పాల రాజా,టి,పి రెడ్డి,మద్దెల పవన్,మెడ రమేష్,మూలం రెడ్డి సుబ్బారెడ్డి,సుంకర పెద్దబ్బాయి,పంతలా సాయి,గోగు గౌరీ,ఫజులుద్దున్ మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News