తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలో నేటి 24 మరియు రేపు 25 తేదీలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకున్న జాయింట్ సెక్రటరీ మరియు ఎండి (హౌసింగ్ ఫర్ ఆల్) గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుల్దీప్ నారాయన్ కి సాదర స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి. అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి స్వాగతం పలకగా కుల్దీప్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు బయల్దేరి వెళ్లారు. వీరితో పాటు తిరుపతి ఆర్డీఓ కనక నరస రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పి డి వెంకటేశ్వర రావు ఉన్నారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం గృహ నిర్మాణ శాఖ ఎండి లక్ష్మి షా వారితో కలసి తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టనున్నారు.
Prajavartha Online Telugu News