రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి ధవళేశ్వరంలోని ఎస్.సి. బాలుర సంక్షేమ వసతి గృహమును సోమవారం సందర్శించారు. అక్కడి వసతులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందితో చెప్పారు. అనంతరం ధవళేశ్వరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్ధులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వసతులు, సదుపాయాల విషయంలో ఏ సమస్యలున్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని పాఠశాల సిబ్బందితో అన్నారు.
Prajavartha Online Telugu News