Breaking News

జిల్లాలో 213 పి ఎ సిఎస్ ల కంప్యూటరీకరణకు చర్యలు- కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 213 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కంప్యూటరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. కంప్యూటరైజేషన్ ఆఫ్ పిఎసిఎస్ ప్రాజెక్టు అమలు జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్లో జరిగింది. రు.8.33 కోట్లతో జిల్లాలో 213 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కంప్యూటరీ కరణ చేయుటకు చర్యలు చేపట్టు టకు కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ క్రింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రు.2516 కోట్లతో 97 వేలకు పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీరణ ప్రాజెక్టు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా 2037 పి ఎ సి ఎస్ లనుకంప్యూటరీకరణ చేపట్టారని అన్నారు. కృష్ణా జిల్లాలో 213 పిఎసిఎస్ల కంప్యూటరీకరణ 8.33 కోట్లతో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30% , నాబార్డు 10 శాతం భరిస్తాయన్నారు. ఒక్కొక్క పిఎసిఎస్ లో కంప్యూటరీకరణకు దాదాపు 4 లక్షల వరకు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్య కన్వీనర్/ కేడీసీసీ బ్యాంక్ సీఈవో ఏ శ్యాం మనోహర్, సభ్యులు నాబార్డ్ డీడీఎం మిలింద్ చౌలాస్కర్, డిసిఒ ఫణికుమార్, ఆప్కాబ్ డిపిడిఎం డి సింధుజ, కమిటీలో సభ్యులైన పిఎసిఎస్ ల కార్యదర్శులు వీ కళ్యాణ్, జె కృష్ణ శంకర్, జి లోకేశ్వరరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *