-వాలంటీర్లకు వందనం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ
-రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 877 మందికి సేవా మిత్ర, రత్న, వజ్ర పురస్కారాలు
రాజమండ్రి రూరల్, ధవలేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని , ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూరాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌరు సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి, నియోజకవర్గ కోఆర్డినేటర్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆకాంక్షించారు.
శుక్రవారం ధవలేశ్వరం జక్కంపూడి సీతారత్నం మెమోరియల్ కమ్యూనిటీ హాల్ లో నిర్వహించిన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వాలంటీర్ వందనం పురస్కారాల కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News