ఫిబ్రవరి 28 న మార్గాన్ని ఎస్టేట్ ప్రాంగణంలో మెగా ప్రాంతీయ జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యా భివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి , పశ్చిమ , కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాజమండ్రీ అర్బన్ నియోజకవర్గం లోని మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీన “మెగా ప్రాంతీయ జాబ్ మేళ” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం కొండలరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ జాబ్ మేళాలో 150 కంపనీలు హాజరుకానున్నాయని ఆయన తెలిపారు. వీటిలో గల వివిధ ఉద్యోగాలలో పనిచేయడానికి ఫార్మసీ, బి టెక్, యం బీ ఏ, యం. టెక్, యం ఫార్మసీ, ఐ టీ ఐ, ఇంటర్, పదవ తరగతి, పూర్తి చేసిన 19 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు గల వారు అర్హులని ఆయన వివరించారు.

ఫిబ్రవరి 28 న నిర్వహించే ” మెగా ప్రాంతీయ జాబ్ మేళా” కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి, తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా వారి వివరాలను

https://tinyurl.com/ZONEII-RegionalJobMela ” రీజనల్ జాబ్ మేళా” కు రెజ్యూమెలతో పాటు ఆధార్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో, సిద్ధపడి ఈనెల 28 వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు మార్గని ఎస్టేట్ వద్దకు రావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు తెలిపారు.

మరిన్ని వివరాలకు “9676052454”, 9133912947″నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *