విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు కుటుంబాల ఆధిపత్యమే తప్ప అభివృద్ధి నోచుకోని అధిక జన ప్రజల తరఫున ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి గా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, జాతీయ సమసమాజ పార్టీ , ప్రబుద్ద రిపబ్లిక్ పార్టీ, జై భారత్ నేషనల్ పార్టీ, నవతరం, స్వతంత్ర జనతా పార్టీ లతో కలిసి మూడో కూటమిగా ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు. దీనికి కన్వీనర్ గా మాజీ ips అధికారి వివి లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయకుమార్, ఆల్ తెలుగు ప్రజా పార్టీ శివ భాగ్య రావు, జాతీయ సమసమాజ పార్టీ రామయ్య యాదవ్, ప్రభుత్వ రిపబ్లిక్ పార్టీ దాసరి చెన్నకేశవులు, స్వతంత్ర జనతా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ వివి లక్ష్మీనారాయణ ఈ కమిటీ ఏర్పాటుకు కృషిచేసిన డాక్టర్ రఘు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News