రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం మార్చ్ 9 వ తేదీన (2వ శనివారం) జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 16 వ తేదీన (3వ శనివారం) నిర్వహించ నున్నట్లు తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని న్యాయస్థానాలలో అన్ని రకాల సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించు కోగలరని అన్నారు. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి మార్చి 16 వ తేదీ 3 వ శనివారం రోజున జరుగు జాతీయ లోక్ అదాలత్ నందు వారి సమస్య లను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Tags rajamandri
Check Also
నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన
-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …
Prajavartha Online Telugu News