తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి ప్రెస్ క్లబ్ కు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ని కలవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి బాలచంద్ర, కోశాధికారి చంద్రబాబుతో పాటు ఉపాధ్యక్షులు ప్రకాష్ బాబు, జాయింట్ సెక్రెటరీ మాధవ్, ఈసీ మెంబర్లు కలెక్టర్ గారిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ప్రెస్ క్లబ్ నిర్వహణ వ్యవహారాలపై ఆరా తీశారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఎన్నికల నిర్వహణ ను అడిగి తెలుసుకున్నారు. ప్రెస్ క్లబ్ కు సొంత భవనం లేని విషయాన్ని కమిటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
Prajavartha Online Telugu News