అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీకి వర్ష ముప్పు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
Prajavartha Online Telugu News