Breaking News

Tag Archives: machilipatnam

జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎన్. చి. నరసింహులు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎన్. చి. నరసింహులు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించబడింది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, పశువైద్యులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన సన్మానం చేశారు. డా. నరసింహులు సుమారు 33 సంవత్సరాలపాటు పశుసంవర్ధక శాఖలో వివిధ హోదాలలో విశిష్ట సేవలందించి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారిగా పదవీ విరమణ పొందారు. ఆయన సేవలను, క్రమశిక్షణను, అంకితభావాన్ని సభలో పలువురు …

Read More »

కౌశలం పోర్టల్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన స్థానిక నైపుణ్య మానవ వనరుల కల్పనకు చర్యలు

-పారిశ్రామికవేత్తలు అందరూ కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి -రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి.. సలహాలు, సూచనలు స్వీకరణ -పరిశ్రమల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుంది -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నైపుణ్య మానవ వనరుల కొరత ఒకటని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌశలం పోర్టల్ కార్యక్రమాన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, …

Read More »

జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జౌళి రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తామని కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రివర్యులు గిరిరాజు సింగ్ కృష్ణాజిల్లా గన్నవరం లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని అటు నుంచి నేరుగా బాపులపాడు మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక వాడలో ఉన్న స్పిన్ టెక్స్ ఇండియా ప్రైవేట్ …

Read More »

మంత్రి గిరిరాజ్ సింగ్ కి అధికారులు ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీ నుండి విమానంలో కృష్ణాజిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి శిసోడియా, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ …

Read More »

పలు పరిశ్రమ యూనిట్లను పరిశీలన

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పామర్రు నియోజకవర్గంలోని పలు పరిశ్రమ యూనిట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ రాయితీలతో ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ కు యూనిట్ వ్యవస్థాపకులు రాయసం వెంకట లక్ష్మి మనోహర్ యూనిట్ నిర్వహణ, ఉత్పత్తి విధానం, ఉపాధి అవకాశాలపై వివరించారు. పుట్టగొడుగుల సాగు విధానం, …

Read More »

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేషన్ విభాగం, తరగతి గదులు, భోజనశాల, మరుగుదొడ్లు, ప్రిన్సిపాల్ బ్లాక్, ల్యాబ్‌లు, లైబ్రరీ, విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను పరిశీలించారు. భవన …

Read More »

రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రధానంగా రీ సర్వే, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రీ సర్వే సేవలపై సానుకూల ప్రజా దృక్పథం తదితర అంశాలపై మాట్లాడారు. ఆయా అంశాలకు సంబంధించిన పురోగతిని సీసీఎల్ఏ కమిషనర్ కు జిల్లా కలెక్టర్ …

Read More »

జలజీవన్ మిషన్, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జలజీవన్ మిషన్ పథకం కింద చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్), డ్వామా, జిల్లా పంచాయతీ, ఐసిడిఎస్ శాఖల అధికారులతో జలజీవన్ మిషన్ పథకం పురోగతి, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు తదితర …

Read More »

గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా బక్రీద్ పండుగ సందర్భంగా గోవధ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశం మందిరంలో పశుసంవర్ధక శాఖ గోవధ నిషేధంపై రూపొందించిన గోడ పత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోవధ నిషేధము జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం గోవులను వధించడం చట్టరీత్యా నేరం అన్నారు. గోవదకు పాల్పడిన అందుకు సహాయపడిన వారు …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ

-సకాలంలో పరిష్కారం చూపాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటిని సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఈ మేరకు జాయింట్ కలెక్టర్ …

Read More »