Breaking News

Tag Archives: rajamendri

ఇండియా స్కిల్స్ పోటీ–ఆంధ్రప్రదేశ్ 2025

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ మార్గదర్శకత్వంలో ఇండియా స్కిల్స్ పోటీ – ఆంధ్రప్రదేశ్ 2025 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో 63 స్కిల్ ట్రేడ్స్‌లో యువత తమ ప్రతిభను ప్రదర్శించి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో వరల్డ్ స్కిల్స్ 2025లో పోటీపడే అవకాశం పొందనున్నారు. ఈ పోటీలో పాల్గొనడానికి అర్హతగా 01-01-2001 తర్వాత జన్మించినవారు 13 ట్రేడ్స్‌లో …

Read More »

బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్యను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి

-రాష్ట్రంలోనీ వసతి గృహాలలో 244 మంది నాల్గవ తరగతి సిబ్బందినీ నియమించడం జరుగుతుంది -బి.సి. సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ సంక్షేమ హాస్టల్లో మెరుగైన విద్య ను అందించే విధంగా చర్యలు తీసు కోవాలని బి. సి. సంక్షేమశాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ, ఎస్ సత్యనారాయణ తెలిపా రు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో సమావేశ మందిరంలో సమైక్య తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని హెచ్ డబ్ల్యు ఓల …

Read More »

స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

-స్వామిత్వ రీ సర్వే పనులు వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా (సా సా) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్ లు, ఎంపీడీవో లు,బి GSWS ఇన్‌ఛార్జ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు …

Read More »

28 కేసుల మద్యం బాటిళ్లు సీజ్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలోని గణేశ్‌నగర్, హుకుంపేక ప్రాంతానికి చెందిన కాజులూరి ఉదయ్ (A1) (32 సంవత్సరాలు) ను స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్, విజయవాడ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అదే కేసులో మరో నిందితుడు వాసిరెడ్డి వెంకటేశ్వరరావు (A2), వయసు 50 సంవత్సరాలు, నివాసం నవభారత్‌నగర్, బొమ్మూరు, రాజమహేంద్రవరం అరెస్టు కావలసి ఉందన్నారు. ఈ కేసును డిటెక్ట్ చేసినది స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్, విజయవాడ. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) డైరెక్టర్, విజయవాడ రాహుల్ దేవ్ …

Read More »

గౌతు లచ్చన్న పోరాట పటిమ మార్గదర్శకం

– లచ్చన్న కుటుంబంతో మా కుటుంబానికి అనుబంధం – వైసిపి హయాంలో బీసీలను పట్టించుకోలేదు – గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించే ఆలోచన చేయలేదు – అధికారికంగా నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే – బిసి జాతి బిడ్డలుగా మనందరికీ ఇది గర్వకారణం – ఆదరణ పథకాన్ని కూడా అటకెక్కించిన వైసిపి ప్రభుత్వం – బీసీలకు అండగా ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం – నగరంలో దామాషా ప్రకారం బిసిలకు పదవులు ఇస్తున్నాం – గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు …

Read More »

అధిక వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి… : కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న నాలుగైదు రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి, జిల్లా స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు ఉన్న అధికారులు, సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టకుండా తమ ప్రధాన కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, డి ఆర్వో టి. సీతారామ మూర్తి లతో కలిసి జిల్లా, క్షేత్ర …

Read More »

పిఎంవి బి.ఆర్.వై. పథకం ద్వారా ఉభయులకు ప్రయోజనం

-ఉద్యోగికి అదనపు వేతనం.. యజమానికి ఆర్థిక ప్రోత్సాహం -ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కమిషనర్ కె. వెంకటేశ్వర్లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి *వికసిత భారత్ రోజ్ గార్ యోజన” (పిఎంవి బిఆర్ వై) కింద నమోదు చేసినట్లు అయితే ఉద్యోగికి అదనపు వేతనం, యజమానికి ఆర్థిక ప్రోత్సాహం మొత్తం లభిస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఉదయం రాజమహేంద్రవరం లోని పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో పి.ఎం.వి.బి.ఆర్.వైపథక అమలుపై క్రెడాయ్ ప్రతినిధులతో ఆయన …

Read More »

మార్కెట్ కమిటీలలో డిజిటల్ విధానం అమలుపై సమీక్ష

-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని 6 వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులతో సమీక్ష జరిపి, ఇకపై మార్కెట్ కమిటీ చెక్పోస్టుల్లో డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించడం జరిగిందనీ పేర్కొన్నారు. ప్రతి మార్కెట్ కమిటీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, చెక్పోస్టుల్లో పటిష్ట ఏర్పాట్లు చేసి, ప్రతి వాహనాన్ని నిశితంగా …

Read More »

సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే

-రాజమండ్రి జిజిహెచ్ లో పిల్లల కోసం అన్ని ఐసీయూలతో కూడిన రెండు, మూడు అంతస్తులను కలెక్టర్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించిన మంత్రి -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి (జిజిహెచ్) తల్లి,పిల్లల ఆరోగ్య కేంద్రం (మదర్ & చైల్డ్ హెల్త్ సెంటర్) …

Read More »

జాయింట్ పట్టాదారులకు భారీ సౌకర్యం

-డిసెంబర్ 31 వరకూ భూ విభజనకు అవకాశం -రూ.500 విభజన రుసుము మాఫీ -రూ.50 నామమాత్రపు రుసుముతో సేవలు -జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో రీ-సర్వే పూర్తైన గ్రామాలలో వెబ్ ల్యాండ్ 2.0లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకునేందుకు 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించబడిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ …

Read More »