Breaking News

Daily Archives: August 1, 2024

జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఘన వ్యర్ధాల నిర్వహణ పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టినప్పుడే రోజువారి ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ తెలిపారు. గురువారం నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జిందాల్ ప్రతినిదులతో ప్లాంట్ సామర్ధ్యం, అవసరమైన వ్యర్ధాలు, ఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ …

Read More »

అన్నా క్యాంటీన్లను ఈ నెల 5 నాటికి పూర్తి స్థాయిలో సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి అల్పాహారం, భోజనంను నామమాత్రపు ధరకే అందించేందుకే సంకల్పించి పునఃప్రారంభం చేయనున్న అన్నా క్యాంటీన్లను గుంటూరు నగరంలో ఈ నెల 5 నాటికి పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో జరుగుతున్నమరమత్తు పనులను కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల వివరాలు, టెండర్ పై ఎస్ఈని అడిగి తెలుసుకొని, పనులపై అధికారులకు తగు …

Read More »

మున్సిపల్ కమిషనర్ ఎచ్.ఎమ్.ధ్యానచంద్రని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నాయకులు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎచ్.ఎమ్.ధ్యానచంద్ర IAS ని వారి క్యాంపు కార్యాలయంలో వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్.డి.రుహుల్లా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Read More »

5, 6 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలక్టర్ల సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో కలక్టర్ల సమావేశాన్ని నిర్వహించనున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లండించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో సిసిఎల్ఏ జి.జయలక్ష్మితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ ఈనెల 5, 6 తేదీల్లో జిల్లా కలక్టర్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని మొదటి రోజు కలక్టర్లతోను, రెండవ …

Read More »

కుష్టు వ్యాధి గ్రస్తులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి

-లెప్రసీ కాలనీవాసులకు మౌలిక వసతులు మెరుగుపరచాలని ఆదేశం భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం వయవృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ మొత్తాన్ని గణనీయంగా పెంచి ఆసరాగా నిలిచిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో నెల పింఛన్లు పంపిణీ తెల్లవారు జామునే ప్రారంభమై ముగింపుకు చేరుకుంది. గురువారం స్థానిక మారుతి నగర్ 7వ వార్డు లెప్రసీ కాలనీ నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కుష్టు వ్యాధిగ్రస్తులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల …

Read More »

డిమాండ్ కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేయండి

-జెన్ కో అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం -శ్రీశైలంలో హైడెల్ విద్యుత్ కేంద్రం సందర్శన అనంతరం అధికారులతో మంత్రి సమీక్ష శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశైలం హైడెల్ పపర్ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ కు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే సౌలభ్యం ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో …

Read More »

పునుగోడు బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం

-ముఖ్యమంత్రి ఆదేశాలతో పరిహారం అందించిన స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి -విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి చొరవతో వారంలోపే బాధితులకు అందిన పరిహారం -ఇటీవల విద్యుత్ షాకుతో ముగ్గురు యువకులు మృత్యువాత అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కనిగిరి పునుగోడులో విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చొరవతో ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందించింది. ఒక్కొక్క కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున బాధిత …

Read More »

నగరి ఆసుపత్రికి వెళ్లి పెన్షన్ పంపిణీ

ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త : మండలంలోని కుక్కలగుంట గ్రామ పంచాయతీకి చెందిన ఎస్ రాజయ్య( 74) పాయల్ సెంటర్ గ్రామానికి చెందిన వ్యక్తి నగరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. పంచాయతీ కార్యదర్శి పోలసాని సుధాకర్ నగరికి వెళ్లి పెన్షన్ సదరు లబ్ధిదారునికి ఆసుపత్రిలో పెన్షన్ అందజేశారు. లబ్ధిదారులు రాజయ్య ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

Read More »

ఆళ్తూరుపాడు రిజర్వాయర్, మేర్లపాక లిఫ్ట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

వెంకటగిరి, ఏర్పేడు తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : సోమశిల స్వర్ణముఖి లింకు కెనాల్ లో అంతర్భాగమైన ఆల్తూరుపాడు రిజర్వాయర్ పూర్తి అయితే శ్రీకాళహస్తి, వెంకటగిరి నియోజక వర్గాలలో సుమారు 90 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు పరిసర ప్రాంతాలలో సుమారు 2.50 లక్షల మందికి త్రాగు నీరు అందుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం డక్కిలి మండల పరిధిలోని ఆళ్తూరుపాడు రిజర్వాయర్ మరియు సంబంధిత కాలువ పనులను కలెక్టర్ సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులతో …

Read More »

వెంకటగిరి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

-జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ను పాఠశాల విద్యార్థినిలతో కలిసి సహపంక్తి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -పేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పనులు వెంకటగిరి నందు ఆగస్ట్ 5 నాటికి పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు నామ మాత్రపు ధరతో ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతమైన ఆశయానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్ లను …

Read More »