-ప్రతి సమస్య మీదా మాట్లాడతాం… ప్రతి అన్యాయాన్నీ ఎదుర్కొంటాం -నా తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం -హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పోటీ -పొత్తులతో వెళ్తామా..? ఒంటరిగా వెళ్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది -తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎప్పుడూ వ్యతిరేకించలేదు -రాష్ట్ర విభజన సగౌరవంగా చేసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదన్నదే మా ఆవేదన -ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య ఇంకెత కాలం ద్వేషం రగిలిస్తారు? -కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా పై చేసిన కామెంట్స్ కు సమాధానం చెబితే …
Read More »Telangana
నిజాంపేట్ లో రాజీవ్ గాంధీ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం
-పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ వైద్య పరీక్షలు అవసరం – డా. మురళీ కృష్ణ నిజాంపేట్ (హైదరాబాద్), నేటి పత్రిక ప్రజావార్త : పరిపూర్ణ ఆరోగ్యానికి తరచూ ప్రాధమిక వైద్య పరీక్షలు చేయించుకుంటే అన్నీ విధాలుగా శ్రేయస్కరమని ఎయిర్ ఫోర్స్ విశ్రాంత అధికారి డా. మురళీ కృష్ణ అన్నారు. మానవసేవే మాధవ సేవ గా భావించే డా.మురళీ కృష్ణ బాచుపల్లి మున్సిపాలిటీ నిజాంపేట్ రాజీవ్ గాంధీ నగర్ లోని క్రిష్ మెడ్ స్పెషాలిటీ క్లినిక్స్ లో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు ఆదివారం ఉచిత వైద్య …
Read More »భారత్-కెనడా CEPA చర్చలకు సానుకూల పురోగతి కనిపిస్తున్న నేపథ్యంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనను FIEO స్వాగతించింది
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ 2026 మే 25 నుండి 27 వరకు కెనడాకు చేయనున్న పర్యటనను స్వాగతిస్తూ, ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా భావిస్తున్నట్లు తెలిపింది. భారత్ మరియు కెనడా ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలను పునరుద్ధరించేందుకు చురుకుగా కృషి చేస్తున్న ఈ సమయంలో ఈ …
Read More »బీహార్ రాష్ట్రం, రాజ్గిర్ లోని నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవం
బీహార్, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా ఈరోజు బీహార్లోని రాజ్గిర్లో ఉన్న నలందా విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. 14 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 221 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆయన అభినందనలు తెలియజేస్తూ, వారి విద్యా విజయాలు కఠిన శ్రమ, పట్టుదలపై నిర్మితమయ్యాయని కొనియాడారు. చరిత్రలోనే అత్యంత గొప్ప విద్యా కేంద్రాలలో ఒకటిగా ప్రాచీన నలందా మహావిహారను గుర్తిస్తూ..”కేవలం సంస్థలుగా మిగిలిపోయే విశ్వవిద్యాలయాలు కొన్ని ఉంటాయి. కానీ నాగరికతకు చిహ్నాలుగా నిలిచే విశ్వవిద్యాలయాలు …
Read More »లంచ్ బాక్స్తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం విజయ్ సరికొత్త పంథా!
-సమయపాలనతో ఆకట్టుకుంటున్న సీఎం చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త : తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నటుడు సి. జోసెఫ్ విజయ్, తన విలక్షణమైన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఆయన అనుసరిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే 10న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ప్రతిరోజూ నిర్దేశిత …
Read More »నేషనల్ టెక్నాలజీ డే: మే 11న సమతా మూర్తి కేంద్రంలో మొబైల్ ఫోన్లకు అనుమతి!
-జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు శ్రీరామనగరం (ముచ్చింతల్), నేటి పత్రిక ప్రజావార్త : సమతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) కేంద్రాన్ని సందర్శించే భక్తులకు, పర్యాటకులకు శుభవార్త. మే 11, 2026న జరగనున్న ‘జాతీయ సాంకేతిక దినోత్సవం’ (National Technology Day) పురస్కరించుకుని ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 1998లో భారతదేశం విజయవంతంగా నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్షలకు (ఆపరేషన్ శక్తి) గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటాము. …
Read More »తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటే వేగంగా క్షీణిస్తున్న జీర్ణక్రియ సామర్థ్యం కూడా..! త్రాయ హెల్త్ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు
-1.6 లక్షల మంది భారతీయ పురుషుల పై నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జీర్ణఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. పురుషుల్లో జుట్టురాలడం మరియు జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. హైదరాబాద, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో జుట్టు రాలుదల సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ బ్రాండ్ త్రాయ హెల్త్ నిర్వహించిన జాతీయ గట్-హెయిర్హెల్త్ అధ్యయనం తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్యసం క్షోభాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలోని పది ప్రధాన …
Read More »సంచలనం సృష్టించిన విజయ్
తమిళనాడు, నేటి పత్రిక ప్రజావార్త : నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. పార్టీని స్థాపించిన కేవలం రెండేళ్లకే చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ‘విజిల్’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్లోనూ ‘సూపర్ ‘సూ హిట్’ కొట్టారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విజయ్.. రెండు చోట్లా తన …
Read More »అంకితభావానికి, నిబద్ధతకి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నిమ్మకాయల వెంకటరమణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాధ్యతల నిర్వహణలో మాత్రమే కాకుండా, అచెంచల నిబద్ధతకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ, సౌత్ సెంట్రల్ రైల్వేశాఖ ప్రతిష్టను మరింతగా పెంపొందించే వారిలో కీలక పాత్ర పోషించినవారు నిమ్మకాయల వెంకటరమణ. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని అంచెంచెలుగా ఎదుగుతూ అజాతశత్రువుగా నిలిచిన వ్యక్తి ఈయన. ఇండియాలో ప్రతిష్టాత్మకమైన వందేభారత్ నడిపిన ప్రతిభాశాలిగా అనితర సాధ్యమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అవిశ్రాంతంగా రైల్వేలో ఎన్నో ఉన్నతమైన పదవులు పొంది తద్వారా ఎందరికో గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన ప్రతిభాశాలి. వాటిలో ఈటిటిసిలో …
Read More »అప్పుడు ఐటీ… ఇప్పుడు క్వాంటం
-నాలెడ్జి ఎకానమీని ఊహించే ఐటీకి ప్రోత్సాహం -ప్రాజెక్టుల నిర్వహణలో పీపీపీలది సక్సెస్ ఫార్ములా -యువ పారిశ్రామికవేత్తలకు ఏపీ స్వాగతం -ఈఓ సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్- 2026లో సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాల క్రితం చేసిన విజన్ ఇప్పుడు ప్రతిఫలాలను ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో అమలు చేసిన ఐటీ, టెక్నాలజీ, విద్యుత్ సంస్కరణలు ఇప్పుడు ప్రయోజనాలను దక్కేందుకు కారణమవుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ …
Read More »
Prajavartha Online Telugu News