-ఏపీ ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం -ఫుడ్ ప్రాసెసింగ్ లో యూఏఈ పెట్టుబడులకు మార్గం సుగమం -వాణిజ్యం, ఎగుమతులు, పెట్టుబడులకు యూఏఈ క్లస్టర్ సహకారం -తొలి పెట్టుబడిగా చిత్తూరులో యూఏఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ -రూ.100 కోట్లతో పెట్టుబడితో ముందుకు వచ్చిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ -సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. …
Read More »Daily Archives: July 21, 2026
రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
-భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న సీఎం -హోంమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రులను కలవనున్న ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభంకానుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి …
Read More »ఏపీలో మహిళా సాధికారితలో మరో కీలక అడుగు
–మహిళా సాధికారతే లక్ష్యంగా మంత్రి కొండపల్లి ఢిల్లీ పర్యటన -SHG మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత -స్త్రీ నిధి ద్వారా పీఎంఎఫ్ఎంఈ పథకం అమలుపై కేంద్ర కార్యదర్శితో మంత్రి కొండపల్లి చర్చలు -స్త్రీ నిధి రుణాల (PMFME) కు వడ్డీ రాయితీ -జిల్లా సమాఖ్యలను PMFME జిల్లా వనరుల సంస్థగా గుర్తింపుపై సానుకూల స్పందన. -భోగాపురం ఎయిర్పోర్ట్లో స్వయం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞప్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను ఆహార ప్రాసెసింగ్ రంగంలో పారిశ్రామికవేత్తలుగా …
Read More »మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు
-ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో గుచ్చిమి క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు -పలమనేరు శిబిరంలో అటవీ శాఖ సన్నాహాలు పూర్తి -ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు అడవి ఏనుగుల బెదడ నుంచి ఉపశమనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రెండు కుంకీ ఏనుగులను పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకి తరలించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముసలమడుగు క్యాంపు నుంచి వీటిని పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపుకి …
Read More »ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కు కేంద్రం నుంచి మరింత సహకారం అవసరం
– కొప్పర్తిలో MSME టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయండి – PMEGP నిధులు పెంచండి – SK యూనివర్సిటీ, విజయనగరం JNTU ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ల పనులను వేగవంతం చేయాలి – ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త సాధనకు కేంద్రం సహకరించాలి – న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు జితన్ రామ్ మాంఝీ, శోభా కరంద్లాజేలను కోరిన మంత్రి కొండపల్లి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ఒక కుటుంబం – ఒక పారిశ్రామిక వేత్త లక్ష్యానికి …
Read More »విశాఖ పోర్టులో కార్గో హ్యాండ్లింగ్ను మూలాపేట పోర్టుకు మళ్లించే అంశాన్ని పరిశీలించనున్న మంత్రుల కమిటీ
-మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి ఐటీ సేవలు, ఐటీ పెట్టుబడులకు కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా, నగరాన్ని పరిశుభ్రమైన, కాలుష్య రహిత మరియు పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో, ప్రస్తుతం విశాఖ పోర్ట్ అథారిటీ (VPA) ద్వారా నిర్వహిస్తున్న దుమ్ము …
Read More »ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు 22వ తేది బుధవారం ఉదయం 11.30గం.లకు ఎపి సచివాలయం 5వ భవనంలోని కలక్టర్ల సమావేశ హాల్లో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్,రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖామాత్యులు సత్యకుమార్ …
Read More »‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ లలో ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ/ నీట్ (IIT-JEE/NEET) శిక్షణతో కూడిన ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం….
-ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ జాయింట్ సెక్రటరీ డా. ఐ. శ్రీదేవి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ద్వారా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ, (IIT-JEE/ NEET) లలో ఉచిత శిక్షణతో కూడిన జూనియర్ ఇంటర్మీడియట్ (1st Year) మరియు సీనియర్ ఇంటర్మీడియట్ (2nd Year) MPC/BiPC కోర్సులలో ప్రవేశాల కోసం అర్హులైన …
Read More »కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ
– ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిపై విస్తృత చర్చ – రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల కొనుగోళ్లు, వ్యవసాయానికి కేంద్ర సహకారంపై కీలకంగా చర్చ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, …
Read More »కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ
-రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతంపై కీలక చర్చలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి తదితర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు మరింత మెరుగైన మద్దతు …
Read More »
Prajavartha Online Telugu News