న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదయ్యే కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి దర్యాప్తు, చార్జిషీట్, విచారణ పురోగతిని పర్యవేక్షించే వ్యవస్థపై తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, 2024-25 నుంచి 2026-27 వరకు బీపీఆర్&డీ నిర్వహించిన 118 శిక్షణా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 1,120 మంది పోలీసు సిబ్బందికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నిర్వహణపై ప్రత్యేక …
Read More »Daily Archives: July 21, 2026
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి
-స్టాఫ్ కౌన్సిల్లో ఉద్యోగుల గళాన్ని బలంగా వినిపిస్తాం -ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధి తో కృషి చేస్తానని మంత్రుల బృందం సమక్షం లో జరిగే స్టాఫ్ కాన్సిల్ సమావేశం లో సంఘ గళం గట్టిగా వినిపించి సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ తెలిపారు. వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. …
Read More »అమరావతి ఛాంపియన్షిప్ నిర్వహణపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన శాప్ చైర్మన్ రవి నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శాప్ చైర్మన్ రవి నాయుడు విజయవాడ లోని శాప్ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి ఐఎఫ్ఎస్ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ కు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా క్రీడా అభివృద్ధి అధికారులు (DSDOలు), యూత్ సర్వీసెస్ అధికారులు, జిల్లా క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా కార్యదర్శులు, ఫిజికల్ డైరెక్టర్లు (PDలు), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PETలు) తదితరులతో వీడియో …
Read More »బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
-ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాల్లో రాత్రి బస తప్పనిసరి -కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు ప్రతి బాలుడికి చేరేలా అధికారులు కృషి చేయాలి -బాలల హక్కుల పరిరక్షణకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిరంతర పర్యవేక్షణ అవసరం -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు – జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ …
Read More »తల్లికి వందనం పథకం అర్హులు, అనర్హులు, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల జాబితాల ప్రదర్శన నేటి (జూలై 22) నుంచి
-స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు జాబితాలు అందుబాటులో ఉంటాయి -జాబితాల్లో అభ్యంతరాలు ఉంటే జూలై 22 మధ్యాహ్నం నుంచి ఫిర్యాదులు స్వీకరణ -ప్రతి ఫిర్యాదును నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు -జిల్లాలో 1,59,812 మంది అర్హులైన తల్లులు – 2,44,614 మంది అర్హులైన పిల్లలు -జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకానికి సంబంధించి అర్హుల జాబితా, అనర్హుల జాబితా, పరిశీలనలో ఉన్న లబ్ధిదారుల …
Read More »ప్రతి ఓటులో ప్రజాస్వామ్య స్పందన..
– ప్రజల భాగస్వామ్యమే ప్రజాస్వామ్యానికి అసలైన బలం – ఓటు హక్కు.. కేవలం హక్కు మాత్రమే కాదు.. బాధ్యత కూడా – ఓటు విశిష్టత స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలి – ఓటర్ల అర్హత అంశంపై 9-సోపానాల ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనం – విస్తృత వినియోగం లక్ష్యంగా నమూనా ప్రమాణాల రూపకల్పనకు కసరత్తు – ఓటర్ల అర్హతపై అత్యుత్తమ విధానాలపై అంతర్జాతీయ వర్క్షాప్లో వక్తల మాట విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ప్రతి ఓటు …
Read More »బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖల సమన్వయం అవసరం
-బాలల చట్టాలు, భద్రతపై జిల్లా స్థాయి ఒకరోజు వర్క్షాప్ నిర్వహణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాలల హక్కుల పరిరక్షణ, బాలల భద్రత, చట్టాల అమలుపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ), మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలోని విజయశ్రీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఒకరోజు జిల్లా స్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవా సంస్థ (DLSA) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ఎస్. …
Read More »రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి పి. జయరావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కృష్ణా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా (ఎఫ్ఏసీ) బాధ్యతలు చేపట్టిన పి. జయరావు మంగళవారం మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జయరావుకు శుభాకాంక్షలు తెలియజేసి, విధుల నిర్వహణలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.
Read More »సేవాభావంతో పనిచేసే నర్సులే వైద్య వ్యవస్థకు వెన్నెముక… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సేవాభావంతో పనిచేసే నర్సులే వైద్య వ్యవస్థకు వెన్నెముక అని, రోగుల సంరక్షణలో నర్సులు పోషించే పాత్ర అత్యంత కీలకమని, వారి సేవా నిబద్ధతే వైద్య రంగానికి బలమైన పునాదిగా నిలుస్తుందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం పోతేపల్లి గ్రామంలోని గ్రేస్ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన బీఎస్సీ నర్సింగ్ 11వ బ్యాచ్ రిలీవింగ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, …
Read More »ప్రజల ఆరోగ్యం, నగర సౌందర్యం పెంపొందించే విధంగా చర్యలు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆరోగ్యం, నగర సౌందర్యం పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని మహాత్మా గాంధీ రోడ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ వారధి పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారించాలని, ప్రధాన రహదారులు, …
Read More »
Prajavartha Online Telugu News