Breaking News

International

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. నియోజకవర్గానికి చెందిన వేముపాటి విజయలక్ష్మి కి వెన్ను సర్జరీ కోసం 2,24,000/- రూపాయలు, కొల్లిపర వెంకట పద్మావతి తుంటి మార్పిడి చికిత్సకు 7,00,000/- రూపాయలు, పబ్బిశెట్టి శ్రీనివాస్ గుండె శస్త్ర చికిత్సకు 5,00,000/- రూపాయలు, వడ్లమూడి శ్రీనివాస్ కు 2,00,000/- రూపాయలు, దమ్ము జయ కు 65,000/- రూపాయలకు ఎల్వోసీ లు అందచేశారు.. మంగళవారం …

Read More »

ఏపీలో మైనింగ్ ఆదాయం 27 శాతం వృద్ధి: ముకేశ్ కుమార్ మీనా

-రూ.4,000 కోట్ల లక్ష్యానికి చేరువలో వసూళ్లు… ఎన్ఓసీల జారీ వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఆంధ్రప్రదేశ్‌లో మైనింగ్ ఆదాయం 27 శాతం వృద్ధి సాధించిందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మైనింగ్ రంగం స్థిరంగా అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు. మైనింగ్ రంగానికి సంబంధించిన …

Read More »

మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలి… : గొలగాని రవికృష్ణ

విజయవాడ పశ్చిమ, నేటి పత్రిక ప్రజావార్త : పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి భుజానికి ఇటీవల సర్జరీ జరిగిందని, ఆయన త్వరగా కోలుకోవాలని భగ వంతుడిని ప్రార్ధించినట్లు గొలగాని ఛారిటబుల్ ట్రస్ ఛైర్మన్ గొలగాని రవికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, ఆయ న త్వరగా కోలుకో వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చేతికి శస్త్రచికిత్స చేయిం చుకున్నప్పటికీ, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ను సందర్శించి రక్త దానం చేసిన అభిమానులతో హృదయపూర్వకంగా సంభాషించడం, ఫోటోలు …

Read More »

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. …

Read More »

చెత్తరహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుదాం

-నిడదవోలులో ఘనంగా నిర్వహించిన’స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, శానిటేషన్ కోట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -బుర్రకథ ద్వారా ప్రజల్లో అవగాహన.. మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన మంత్రి దుర్గేష్ -పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …

Read More »

ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ విజయవాడ రూరల్ నందు అంగన్వాడి కార్యకర్తలు మరియు అంగన్వాడి ఆయా పోస్టుల భర్తీ.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : యన్.టి.ఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కార్యకర్తలు, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తునట్లు సి.డి.పి.ఓ పి. భానుమతి ప్రకటనలో తెలిపారు. విజయవాడ పరిధిలోని అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు 8 వ డివిజన్ లోని ఇజ్రాయిల్ పేట-2 నందు SC-II కేటగిరి లో షాబాద్ గ్రామము షాబాద్ నందు OC కేటగిరిలో, గొల్లపూడి గ్రామము గొల్లపూడి-8 నందు SC-II కేటగిరిలో, గొల్లపూడి-16 నందు BC-A కేటగిరిలో, గొల్లపూడి-17 నందు OC కేటగిరిలో, …

Read More »

వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంపు

-కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 విడతలుగా 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు -క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ఏర్పాట్లు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యాధుల వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు, అధికారులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ‘ఒన్ హెల్త్ ‘ ప్రోగ్రాం కింద నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి వ్యాధుల నివారణలో సంబంధిత శాఖల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ డీసిజ్ …

Read More »

“సొంత ప్యాలెస్‌లకు వేల కోట్లు.. ప్రజా రాజధానికి సున్నాలా?”

– “నాడు అసెంబ్లీలో ‘జై’.. అధికారం రాగానే ‘నై’.. ఇది కదా అసలైన వంచన!” – పీపీపీ విధానంలో వచ్చే సంస్థలను “మేం వస్తే అరెస్ట్ చేస్తాం” అని బెదిరించడం జుగుప్సాకరం. – “కులాల మధ్య చిచ్చు.. ప్రాంతాల మధ్య విషం.. ఇదే జగన్ రెడ్డి నీచ రాజకీయం!”* -11 సీట్లకు పడిపోయినా ఇంకా మీ “తాచుపాము” బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం. -సమాచార శాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధాని అమరావతితోనే రాష్ట్ర …

Read More »

ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 కి రెట్టించిన ఉత్సాహంతో భారీగా తరలి వచ్చిన ప్రజలు

-ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ -అదరహో అనే విధంగా యువతను, ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు -కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు -కేరింతల సందడితో జన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణం -వివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెట్టించిన ఉత్సాహంతో భారీగా ప్రజలు తరలివచ్చారు. రెండవ రోజైన ఆదివారం …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలతో ప్రజలు సంతృప్తిగా ఇంటికి వెళ్లగలిగే పరిస్థితి రావాలి

-వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరగాలి -వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఉపేక్షించం.. కఠిన చర్యలు తీసుకుంటాం -నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సమావేశంలో వైద్య సిబ్బందిని హెచ్చరించిన- మంత్రి కొలుసు పార్థసారధి -ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగులతో మాట్లాడిన మంత్రి పార్థసారధి ఏలూరు, నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వ ఏటా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అందుకుతగిన విధంగా ప్రజలకు అందించే సేవలలో ఫలితాలు రావాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార …

Read More »