విజయవాడ పశ్చిమ, నేటి పత్రిక ప్రజావార్త :
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి భుజానికి ఇటీవల సర్జరీ జరిగిందని, ఆయన త్వరగా కోలుకోవాలని భగ వంతుడిని ప్రార్ధించినట్లు గొలగాని ఛారిటబుల్ ట్రస్ ఛైర్మన్ గొలగాని రవికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, ఆయ న త్వరగా కోలుకో వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చేతికి శస్త్రచికిత్స చేయిం చుకున్నప్పటికీ, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ను సందర్శించి రక్త దానం చేసిన అభిమానులతో హృదయపూర్వకంగా సంభాషించడం, ఫోటోలు దిగడం, వారితో సమయం గడపడం వంటి అంశాలు అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవికి వున్న ప్రేమ మరియు అచంచలమైన నిబద్ధతకు నిజమైన ప్రతిబింబమని రవికృష్ణ కొనియాడారు.
Prajavartha Online Telugu News