Breaking News

Tag Archives: vijayawada

పి.బి. సిద్ధార్థ, ఎస్.ఆర్. వర్సిటీ మధ్య ఒప్పందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశోధక విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎస్.ఆర్. యూనివర్సిటీ (వరంగల్) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. పి.బి. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ డా . మేకా రమేశ్, ఎస్.ఆర్. యూనివర్సిటీ డీన్ డా. బాలాజీ మారం ఈ ఒప్పందపత్రాలపై శుక్రవారం సంతకాలు చేశారు. పిహెచ్.డి. చేసే విద్యార్థులకు ఈ పరస్పర అవగాహన ఒప్పందం కారణంగా సాంకేతిక సహకారం, సేవలు అందుతాయన్నారు. పోస్ట్ డాక్టరేట్ సాంకేతిక శిక్షణా కార్యక్రమాలు …

Read More »

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్ 47వ డివిజన్ కు చెందిన పిల్లా జనార్ధనరావు గుండె వాల్వ్ ల సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకు సర్జరీ కోసం 8,50,000 /- రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో ఆయన ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి వైద్య ఖర్చుల నిమిత్తం సాయం చేయాలని సీఎం సహాయ నిధికి లేఖ రాసారు. అందుకు సంబంధించిన ఎల్వోసీ పత్రాలను శుక్రవారం భవానీపురం ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు …

Read More »

హజ్ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి – యాత్రికుల ప్రయాణానికి సర్వం సిద్ధం

-రేపు తొలివిడత హజ్ యాత్రికులు ప్రయాణం-మంత్రి ఉదయం జెండా ఊపి ప్రారంభిస్తారు -రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం నుంచి తొలిసారి నిర్వహిస్తున్న హజ్ యాత్ర -హజ్ యాత్ర సురక్షితంగా, సాఫీగా సాగేందుకు పటిష్ట చర్యలు -యాత్రికుల భద్రతే అత్యంత ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి సూచన -మైనార్టీ వ్యవహారాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్రికుల ప్రయాణం సాఫీగా, సురక్షితంగా సాగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని మైనారిటీ సంక్షేమ శాఖ …

Read More »

నేటి నుంచే కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండ‌గ‌

– మూడు రోజుల పాటు క‌ళా సాంస్కృతిక సంబ‌రం – ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములై వార‌స‌త్వ సంప‌ద‌కు వ‌న్నె తేవాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18వ తేదీ శ‌నివారం నుంచి మూడు రోజుల పాటు కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండ‌గ అత్యంత వైభవంగా జ‌ర‌గ‌నుంద‌ని.. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్ర‌పంచ వార‌స‌త్వం దినోత్స‌వం (World Heritage Day) సంద‌ర్భంగా జిల్లాలో మ‌న ఘ‌న …

Read More »

సహకార రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త శకం

– KDCC విజయగాథపై సీఎం చంద్రబాబుతో రఘురాం కీలక చర్చలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని అమరావతి సచివాలయంలో మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCC) చైర్మన్ నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ రంగం బలోపేతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, రైతు సంక్షేమం వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రితో విస్తృతంగా చర్చించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గత కొన్నేళ్లలో …

Read More »

రోగులకు అందించే సేవల్లో రాజీ ప్ర‌స‌క్తే లేదు

– ఆసుప‌త్రి సేవల‌పై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌క్తం కావాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాల‌ని, ఆసుప‌త్రి సేవ‌ల‌పై పూర్తిస్థాయిలో సంతృప్తి వ్య‌క్తం కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం నందిగామ‌లోని డీవీఆర్ కాల‌నీ యూపీహెచ్‌సీతో పాటు స్థానిక సీహెచ్‌సీని త‌నిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత తదితర అంశాలను …

Read More »

ప్రకృతి వ్యవసాయ పంట పొలాల పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ IAS, నందిగామ మండలం కంచేల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు. కంచేల గ్రామంలోని రైతు సిచ్ వి.ఎన్. మహేంద్ర పొలంలో మామిడి తోటలో ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించే జీవ ఉత్ప్రేరకాలు అయిన ద్రవ జీవామృతం, కీటకనాశిని, దశపర్ణి కషాయాల తయారీలో పాల్గొన్నారు. అలాగే ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS)లో పాల్గొని విత్తన గుళికల తయారీని పరిశీలించారు. విత్తనాలు …

Read More »

స్వీయ గ‌ణ‌న‌తో దోష‌ర‌హిత డేటా!

– ఈ ప్ర‌క్రియ‌లో ఉత్సాహంతో భాగ‌స్వాములుకండి – అందుబాటులో https://se.census.gov.in పోర్ట‌ల్ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వీయ గ‌ణ‌న‌తో దోష‌ర‌హిత డేటాతో పాటు స‌మ‌యం ఆదా అవుతుంద‌ని.. ప్ర‌తిఒక్క‌రూ డిజిట‌ల్ జ‌న గ‌ణ‌న తొలిద‌శ‌లో భాగంగా ప్రారంభ‌మైన స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ – ఎస్ఈ)లో ఉత్సాహంగా పాల్గొని త‌మ ఇంటి నుంచే స‌మాచారాన్ని న‌మోదు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు. శుక్ర‌వారం న‌గ‌రంలోని పీబీ సిద్ధార్థ క‌ళాశాల‌లో సెన్స‌స్‌-2027కు సంబంధించి ఎన్యూమ‌రేట‌ర్లు, …

Read More »

విద్యా ప్ర‌మాణాల‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట‌

– పాఠ‌శాల‌ల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో రాజీలేదు – విద్యార్థులు స‌ద్వినియోగం చేసుకొని బాగా చ‌దువుకోవాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అత్యున్న‌త విద్యా ప్ర‌మాణాల‌తో విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌ని.. పాఠ‌శాల‌ల్లో క‌ల్పించిన సౌక‌ర్యాల‌ను స‌ద్వినియోగం చేసుకొని చిన్నారులు బాగా చ‌దువుకొని ఉన్న‌తంగా ఎద‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న‌ల్లో భాగంగా శుక్ర‌వారం నందిగామలోని డీవీఆర్ కాల‌నీ ఎంపీపీ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. …

Read More »

అంగ‌న్వాడీ కేంద్రంలో త‌నిఖీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నందిగామ డీవీఆర్ కాల‌నీలోని అంగ‌న్వాడీ కేంద్రాన్ని కూడా త‌నిఖీ చేశారు. చిన్నారులలో వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువుకు సంబంధించిన రికార్డుల‌ను ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. చిన్నారుల‌కు అందిస్తున్న పోష‌కాహారం వివ‌రాల‌ను ప‌రిశీలించారు. చిన్నారులలో తీవ్ర పోషకాహార లోపం (సివియర్ ఎక్యూట్ మాల్న్యూట్రిషన్- ఎస్ ఏ ఎం), మిత పోషకాహార లోపం (మోడరేట్ ఎక్యూట్ మాల్ న్యూట్రిషన్ -ఎం ఏ ఎం) ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. …

Read More »