Breaking News

Tag Archives: vijayawada

సేంద్రియ కూరగాయలతో ఆరోగ్యమైన హ్యాపీ సండే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సౌజన్యంతో One Earth – One LIFE తరపున హ్యాపీ సండే లో భాగంగా “ఫార్మర్ టు కన్జ్యూమర్ ” కార్యక్రమం నగర ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన మార్గదర్శకంగా నిలవాలని ఉద్దేశంతో ఆదివారం ఉదయం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం రసాయన రహిత (ఆర్గానిక్) కూరగాయలను నేరుగా రైతుల నుండి వినియోగదారులకు అందించడం. మధ్యవర్తులు లేకుండా, రైతులకు సరైన ధర అందిస్తూ, వినియోగదారులకు తాజా, …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి …

Read More »

ఈ నెల 13న పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీక‌ర‌ణ‌

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీక‌రించనున్న‌ట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపడుతునున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …

Read More »

మహాత్మా  జ్యోతిరావు పూలే సిద్ధాంతాలు ఆదర్శప్రాయం..

-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమ సమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆచరించిన సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధ్వర్యంలో శనివారం తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి …

Read More »

క్రీడాకారుల ప్రతిభకు ప్రోత్సహం అవసరం…

-అవకాశాలను అందిపుచ్చుకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా రానించాలి.. -కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ కు ఊపు.. -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: క్రీడాకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాన్ని అందిపుచ్చకుని అంతర్జాతీయ క్రీడాకారులుగా రానించేందుకు కృషి చేయాలని వాటర్ స్పోర్ట్స్ యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. వాటర్ స్పోర్ట్స్ లో యువతను ప్రోత్సహించేందుకు జిల్లా క్రీడా సంస్థ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ …

Read More »

మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం..

-రైజ్ శిక్షణ వర్క్ షాప్ ద్వారా మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలన్నదే లక్ష్యం.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వాలంభన సుస్థిర భవిష్యత్తుకు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయని రైజ్ సెంటర్ ద్వారా మహిళలకు చేతి వృత్తులపై శిక్షణ ఉపాధి అవకాశాలపై వర్క్ షాప్లను నిర్వహించి ప్రతి మహిళాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిదేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. విజయవాడ రూరల్ మండలం గుంటుపల్లిలో ఏర్పాటు …

Read More »

ఘనంగా మహాత్మా జ్యోతి బా పూలే 200వ జయంతి రాష్ట్ర స్థాయి వేడుకలు

-దేశంలో విద్యా, సామాజిక సమానత్వానికి ఆద్యులు జ్యోతిబా పూలే -పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం -బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -పూలే ఆశయాలు నేటికీ మార్గదర్శకం -రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత -రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు -రాష్ట్ర గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, …

Read More »

ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రి భాయి పూలే సేవలు అమోఘ‌మ‌ని, ఆమె బాలికా విద్యా వికాసానికి చేసిన కృషి అపారమని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినo సందర్బంగా విజయవాడలోని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎఐబీఎస్​పీ …

Read More »

ఎన్నారై, పి.బి. సిద్ధార్థ కంప్యూటర్ సదస్సు పరిశోధన పత్రాల ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పోతవరప్పాడులోని డాక్టర్ ఆర్.వి.ఆర్- ఎన్.ఆర్.ఐ ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ డీమ్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగాలు ఫిబ్రవరిలో సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు వ్యాసాల ప్రచురణను శనివారం పోతవరప్పాడులోని ఎన్నారై డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై పక్షాన చాన్సలర్ డాక్టర్ ఆర్.వెంకటరావు, వైస్ చాన్సలర్ కె.ఆర్.ఎస్ సాంబశివరావు, ఈవో మోటూరి తేజసాయి, ప్రో వైస్ ఛాన్సలర్స్ డా. సి.నాగభాస్కర్, జి. సాంబశివరావు, …

Read More »

ఓబీసీలకు సబ్ కోటా కల్పించాలి… : బీసీ సంఘాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు (నారీ శక్తి వందన్ అధినియం)లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కల్పించాలని బీసీ సంఘాల నేతలు, మహిళా హక్కుల కార్యకర్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గ భవాని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇస్తున్నట్లు గానే ఓబీసీ మహిళలకూ రాజకీయాల్లో వాటా దక్కేలా వెంటనే చేయాలని, ఇది దాతృత్వం కాదని, వారి హక్కు అని తేల్చి చెప్పారు. ఏ కులం …

Read More »