Breaking News

Tag Archives: vijayawada

ఆకాంక్షిత మండలంలో ఆదర్శ కార్యక్రమం

– మానసిక ఆరోగ్య సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలి – ఆత్మనిర్భరతకు నైపుణ్య శిక్షణలే బాట – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంలో నైపుణ్య శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేసి, జీవనోపాధి సహాయాన్ని అందించే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ఈ ఆకాంక్షిత (aspiration block) మండలంలో కమ్యూనిటీ మెంటల్ హెల్త్ కార్యక్రమాలను అమలు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. …

Read More »

కసాయిలకు భృతి అందిస్తాం… : అల్తాఫ్ బాబా

-గోవధ ను స్వచ్ఛందంగా నిషేధించిన కసాయిలకు అల్తాఫ్ బాబా బహుమతి కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : గోవధ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరిస్తే కసాయిలకు షాబుఖారి ఆస్థాన తరపున భృతి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా. ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఆయన సీఐ సుబ్రహ్మణ్యంకు తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాలు మతసామరస్యం కాపాడుకునే విధంగా కసాయిలను ఆదుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా …

Read More »

కనెక్ట్ ఏపీ లాంటి ఎక్స్పో రాబోయే తరాలకు చాలా అవసరం

-కొత్త కొత్త ఆవిష్కరణలన్ని విజయవాడ కేంద్రంగా చూడడం ఆనందదాయకం -కనెక్ట్ ఏపీ – ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బీపేట లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ నందు కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ బండారు కృష్ణ ఆధ్వర్యంలో కనెక్ట్ ఏపీ లాంటి ఒక …

Read More »

ఏపీఐఐసీ కాలనీవాసుల చిరకాల వాంఛ తీర్చే దిశగా ఎంపీ చిన్ని అడుగులు

-దశాబ్దాల కాలం నుంచి ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యపై ఎంపీ చిన్ని ప్రత్యేక చొరవ -500 కార్మిక కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి -ఏపీఐఐసీ కాలనీవాసుల సమస్యపై సిఎస్ సాయి ప్రసాద్ తో ప్రత్యేక సమావేశం -సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మంత్రి అనగానీ సత్య ప్రసాద్ ఎమ్మెల్యే గద్దె రామ్మ హన్ ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసీ కాలనీ వాసుల రిజిస్ట్రేషన్ సమస్యపై సి ఎస్ సాయి ప్రసాద్ అధ్యక్షతన …

Read More »

చట్టాన్ని ఉల్లంఘించే, స్కానింగ్ సెంట‌ర్ల‌, మరియు ఐవీఎఫ్ సెంటర్ల పై క‌ఠిన చ‌ర్య‌లు

– ఆక‌స్మిక త‌నిఖీల‌ను ముమ్మ‌రం చేయాలి – క్షేత్ర‌స్థాయిలో విస్తృత అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ (పీసీ-పీఎన్‌డీటీ) చ‌ట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని.. స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల బృందాలు క్షేత్ర‌స్థాయిలో ఆక‌స్మిక త‌నిఖీలు, డెకాయ్ ఆప‌రేష‌న్ల‌ను ముమ్మ‌రం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో గర్భస్థ పిండలింగ నిర్ధారణ …

Read More »

విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తక్షణ చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిస్కమ్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిల్స్ సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఆపరేషన్స్)తో వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలకు సంబంధించి ముందుగానే ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే టోల్ ఫ్రీ నెంబర్ 1912 మరియు వాట్సాప్ సేవల …

Read More »

మ‌న‌మే మారుదాం.. మ‌న భూమిని కాపాడుదాం..

– చెట్ల‌ను పెంచుతూ భ‌విష్య‌త్తుకు ర‌క్ష‌ణ‌గా నిలుద్దాం – ప్ర‌తి ప‌రిశ్ర‌మ ఆవ‌ర‌ణ‌లో 33 శాతం హ‌రిత హారం త‌ప్ప‌నిస‌రి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌న‌మే మారి.. మ‌న భూమిని కాపాడుకుందామ‌ని.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. జూన్ 5న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా చెట్ల‌ను పెంచండి.. భ‌విష్య‌త్తును కాపాడండి.. అనే సందేశంతో రూపొందించిన పోస్టర్ల‌ను క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో …

Read More »

అక్ష‌రాంధ్ర వెలుగుబాట‌లో మ‌రో అడుగు..

– జులై 21 నుంచి మార్చి 15 వ‌ర‌కు మ‌లి ద‌శ కార్య‌క్ర‌మం – స‌మ‌ష్టి కృషితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేద్దాం – జిల్లా, మండ‌లం, మునిసిప‌ల్ స్థాయి క‌మిటీలు నిబ‌ద్ధ‌త‌తో కృషిచేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ సాకారానికి వెలుగుబాట అయిన అక్ష‌రాంధ్ర కార్య‌క్ర‌మం జిల్లాలో విజ‌య‌వంతంగా అమ‌ల‌వుతోంద‌ని.. 2027 నాటికి ఎన్టీఆర్ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత‌ జిల్లాగా తీర్చిదిద్దే ల‌క్ష్యంతో రెండో ద‌శ కార్య‌క్ర‌మం కింద ఈ ఏడాది …

Read More »

వేస‌వి విప‌త్తుల‌పై అప్రమత్తంగా ఉండాలి

– అగ్ని ప్ర‌మాదాల‌పై వేగ‌వంతమైన స్పంద‌న ముఖ్యం – క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ క్రియాశీలంగా ఉండాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేస‌వి తీవ్ర‌త దృష్ట్యా జిల్లాలో అగ్ని ప్ర‌మాదాలు, ఇత‌ర విప‌త్తుల ప‌ట్ల అధికారులు ఎల్ల‌ప్పుడూ అప్రమ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ బ‌స్ స్టేష‌న్ స‌మీపంలోని ఫైర్ స్టేష‌న్‌ను త‌నిఖీ చేశారు. అగ్నిమాప‌క వాహ‌నాలు, రెస్క్యూ ప‌రిక‌రాలను ప‌రిశీలించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు వినియోగించే ఉప‌క‌ర‌ణాల‌ను ప‌రిశీలించారు. ఎత్త‌యిన భ‌వ‌నాల్లో …

Read More »

వాతావరణాన్ని చల్లపరిచిన mist వెహికల్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణాన్ని చల్లపరిచిన సుజనా చౌదరి శాసనసభ్యుల వారి ఆదేశాలతో కదిలిన మాజీ కార్పొరేటర్ అన్న క్యాంటీన్ చైర్మన్ బుల్లా విజయ్ కుమార్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో మాట్లాడి mist వెహికల్స్ ని తీసుకొని పాల ఫ్యాక్టరీ నుండి కాళేశ్వరరావు మార్కెట్ వరకు, సొరంగం నుండి భవానిపురం స్వాతి సెంటర్ నుండి గొల్లపూడి వై జంక్షన్ నుండి భవానిపురం దర్గా వరకు రోడ్డు మీద నీటి తుంపర వెహికల్ తొ నీళ్లు చెల్లించి భగభగ మండే …

Read More »