Breaking News

Tag Archives: vijayawada

నున్న గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం లో పాల్గొన్న విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతన్నలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై ఆయన ఆరా తీశారు. మెజారిటీ రైతులకు నగదు …

Read More »

ఉన్నత విద్యావకాశాలు కెరీర్ అవకాశాలు పై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మేరీ స్టెల్లా కళాశాల లో కెరీర్ గైడెన్స్ సెల్ మరియు ఫ్రెంచ్ విభాగం ఫ్రెంచ్ ఎంబసీ , క్యాంపస్ హైదరాబాద్ ఆధ్వర్యం ఫ్రెంచ్ బాషలో ఉన్నత విద్యావకాశాలు కెరీర్ అవకాశాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఫ్రెంచ్ విభాగాధిపతి డాక్టర్ బ్యూలా నోయెల్ ఫ్రెంచ్ బాష ప్రాధాన్యతని నేటి యువత ఉపాధి అవకాశాలు గురించి మాట్లాడారు. ప్ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ మాట్లాడుతూ నేటి యువత ఎదుగుదలకు ఎన్నో విద్య ఉపాధి అవకాశాలు కు అనేక నూతన …

Read More »

కేఎల్ రావు పార్క్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రారంభం

-విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 46వ డివిజన్, చిట్టినగర్ లో ఉన్న కే ఎల్ రావు పార్క్ లో ఓపెన్ ఎయిర్ థియేటర్ ని ప్రారంభించారు విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 17 లక్షల వ్యయంతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ఓపెన్ థియేటర్ నిర్మించాలని అన్నారు. పునర్నిర్మాణం లో భాగంగా బుడమేరు వరదల వల్ల దెబ్బతిన్న ఈ ప్రాంతాన్ని, వాకింగ్ …

Read More »

ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితీ ప్రకటించిన ప్రభుత్వం

-ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను వడ్డీ పై 50% రాయితినిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఏక మొత్తంలో ఆస్తి పన్ను మరియు వడ్డీ చెల్లించినచో, వడ్డీ పై 50 శాతం రాయితీని పొందవచ్చని అన్నారు. ఈ అవకాశం మార్చి 31, 2026 వరకు మాత్రమే అని, ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …

Read More »

ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటరులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లీం సోదరులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్(చిన్ని) ముస్లీం సోదరులతో కలసి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మైనారిటీ సంక్షేమ శాఖ, న్యాయ మంత్రి ఎన్ ఎండి ఫారుక్, ఇతర ప్రజా ప్రతినిధులతో పాటుగా ముస్లీం సోదరులతో కలసి ఇఫ్తార్ విందు, నమాజ్, డిన్నర్‌లలో …

Read More »

ఎనికేపాడులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు గ్రామంలోని మస్జిద్ ఈ మహమ్మదీయా వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. సోమవారం రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సోదరభావానికి ప్రతీకగా …

Read More »

39 వ జాతీయ యువజనోత్సవాల్లో పి.బి. సిద్ధార్థ కళాశాల ప్రభంజనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 10 నుంచి 14 వ తేదీ వరకు చెన్నైలోని సత్యభామా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన 39వ జాతీయ అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో  కృష్ణా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన్న అన్ని పోటీల్లో వివిధ బహుమతులను వరసగా నాలుగోసారి విజయవాడ పి. బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కైవసం చేసుకుందని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలితప్రసాద్, …

Read More »

రైతన్నా మీకోసమే మేమంతా..

– వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు ప్ర‌భుత్వం కృషి – ఆధునిక సాంకేతిక‌త‌ను అన్న‌దాత‌కు చేరువ‌చేస్తున్నాం – ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి – ఏక పంట‌కు ప‌రిమితం కాకుండా పంట వైవిధ్య‌త‌ను అనుస‌రించాలి – అధిక దిగుబడితో పాటు నికరాదాయం పొందాలి – రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైత‌న్న క్షేమం, సంక్షేమం కోసం ప్ర‌భుత్వం అహ‌ర్నిశ‌లు కృషిచేస్తోంద‌ని.. ఈ దిశ‌గా కృత్రిమ మేధ (ఏఐ), డ్రోన్ సాంకేతిక‌త వంటి ఆధునిక సాంకేతిక …

Read More »

వంట గ్యాస్ స‌ర‌ఫ‌రాపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌

– సజావుగా సాగేలా విస్తృత తనిఖీలు – ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంద‌ని.. విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్నారు. సోమవారం జేసీ ఇల‌క్కియ అధికారుల‌తో క‌లిసి విజయవాడ వన్ టౌన్ సుమన్ గ్యాస్ ఏజెన్సీ, గుణదలలోని అహ్మద్ గ్యాస్ ఏజెన్సీ, నున్నలోని మారుతి గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. …

Read More »

ప్ర‌తి అర్జీకీ నాణ్య‌మైన ప‌రిష్కారం చూపండి

– గ‌డువులోపు స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేయాలి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 88 అర్జీలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)కు వ‌చ్చే ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గ‌డువులోగా స‌మ‌స్య‌కు నాణ్య‌మైన ప‌రిష్కారం చూపాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌ల నుంచి …

Read More »