Breaking News

Tag Archives: vijayawada

చిన్నారుల బంగారు భ‌విత‌కు న‌వ‌చేత‌న‌

– అభివృద్ధి ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించే వినూత్న చర్యలు – ఏఐ ఆధారిత స్క్రీనింగ్‌తో చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక దృష్టి – రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ఎ.సూర్య‌కుమారి, క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల బంగారు భ‌వితకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన న‌వ‌చేత‌న కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, పిల్ల‌లు అన్ని విధాలా ఎదుగుద‌ల‌లో అంగ‌న్వాడీ కేంద్రాల పాత్ర కీల‌క‌మ‌ని రాష్ట్ర మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి ఎ.సూర్య‌కుమారి, …

Read More »

సాంఘిక సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో ప్ర‌వేశాలు ప్రారంభం

– 33 హాస్ట‌ళ్ల‌కు ఔత్సాహిక విద్యార్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం – జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హర్షిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 33 సాంఘిక సంక్షేమ బాలురు, బాలిక‌ల వ‌స‌తి గృహాల్లో 2026-27 విద్యా సంవ‌త్స‌రానికిగాను మూడో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల ప్ర‌వేశాల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా ఎస్‌సీ సంక్షేమం, సాధికారిత అధికారి కేఎల్ హర్షిత మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో కోరారు. అదేవిధంగా ఇంట‌ర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, …

Read More »

ఈ నెల 20న విజయవాడలో మెగా జాబ్ డ్రైవ్…

-350కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీ….. -​జిల్లా నైపుణ్యాబివృద్ధి అధికారి -ఎస్. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన విజయవాడలో ప్రత్యేక ఉద్యోగ మేళా (Specific Job Drive) నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ​ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సాఫరాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఇండియా (Safran Electrical & Power India – …

Read More »

రోగుల ప్రాణాల‌ను కాపాడే యోధులు… నర్సులు

– సేవలో మానవత్వం… నర్సింగ్ వృత్తి గొప్పతనం – సంతృప్తికర వైద్య సేవ‌ల్లో న‌ర్సుల పాత్ర కీల‌కం – వ‌న‌రుల స‌ద్వినియోగంతో ప్రైవేటుగా దీటుగా జీజీహెచ్ సేవ‌లు – త్వ‌ర‌లో అన్ని స‌మ‌స్య‌ల‌కూ ప‌రిష్కారం – ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని.. వైద్యులతో సమానంగా నర్సులు కూడా అహర్నిశలు కష్టపడుతూ రోగులకు ధైర్యం, భరోసా క‌ల్పిస్తూ చ‌క్క‌ని చిరున‌వ్వుతో ఆత్మీయత‌తో రోగాన్ని దూరం చేస్తున్నార‌ని ఎంపీ కేశినేని …

Read More »

11 రోజుల సమ్మె కాలం ఇంజనీరింగ్, పార్కు, పారిశుద్ధ్య కార్మికుల జీతం చెల్లించండి

-కలెక్టర్ కి ఏఐటియుసి విజ్ఞప్తి -మాచవరం వద్దనున్న మలేరియా కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్, పార్కు కార్మికుల జీతాల పెంపుదల కోసం వారికి సంఘీభావంగా 11 రోజులపాటు పారిశుధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నదని, నగరపాలక సంస్థ అధికారులు తక్షణం స్పందించి జీతాలు …

Read More »

జన గణనను వేగవంతం చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణనను వేగవంతం చేయాలని చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం భవానీపురం, నాలుగు స్తంభాల సెంటర్, కబేళా, సితార సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి ఎన్యుమేరేటర్లు మరియు సూపర్వైజర్లతో చేసే జన గణన ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారితో పాటు స్వయంగా తానే ఒక కుటుంబంతో మాట్లాడి, ప్రశ్నలన్నింటినీ అడిగి, జనగణన ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

ఏపీ చాంబర్స్ అమరావతి, విశాఖపట్నంలో వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ కేంద్రాల ఏర్పాటు కోరింది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ చాంబర్స్) రాష్ట్రంలో పెరుగుతున్న అంతర్జాతీయ ప్రయాణాలు మరియు వీసా సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అమరావతి / రాజధాని ప్రాంతం మరియు విశాఖపట్నంలో పూర్తిస్థాయి వీఎఫ్‌ఎస్ గ్లోబల్ వీసా అప్లికేషన్ కేంద్రాలు (VACs) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జి. సాయి ప్రసాద్, ఐఏఎస్ గారికి సమర్పించిన ప్రతినిధిత్వంలో, ఏపీ చాంబర్స్ అధ్యక్షులు శ్రీ పొట్లూరి భాస్కరరావు …

Read More »

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొక్కిరిగడ్డ నీరజ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరానికి చెందిన కొక్కిరిగడ్డ నీరజ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకు అర్హత సాధించాడు. గత ఫిబ్రవరి 2వ తేదీ హైదరాబాద్ లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీ బోర్డు వాయిద్యకారులు ఏకకాలంలో ప్రదర్శన నిర్వ హించారు. ఈ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడంతో ఈ ప్రదర్శనలో ప్రతిభ చాటిన 777 మంది విద్యార్థులకు గిన్నిస్ వరల్డ్ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండంగి నుంచి జెరుబూబ్బెల్ గిన్నిస్ రికార్డు ధ్రువపత్రం అందుకున్నారు. …

Read More »

హనుమాన్ జయంతి సందర్భంగా పోతిన వెంకట మహేష్ ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జయంతి సందర్భంగా పోతిన వెంకట మహేష్ పంచముఖ ఆంజనేయ ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం పలు ఆంజనేయ స్వామి దేవస్థానాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ…ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించి శుభాకాంక్షలు తెలిపారు. పిల్ల రవి పుట్టినరోజు మరియు హనుమాన్ జయంతి సందర్భంగా రావి చెట్టు సెంటర్ సిద్దిక్ హాస్పిటల్ వద్ద 750 మందికి మజ్జిగ …

Read More »

పెరుగుతున్న ఎండల దృశ్య వి ఎం సి రక్షణ చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున విజయవాడ నగరపాలక సంస్థ ప్రజల కోసం రక్షణ చర్యలు తీసుకుంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్డు, అతారత్తయ్య వీధి, సాంబమూర్తి రోడ్డు, కోనాడా సూర్యప్రకాష్ రోడ్డు, గవర్నర్పేట, దుర్గాపురం, గులాబీ తోట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని …

Read More »