Breaking News

Tag Archives: vijayawada

అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో 5 జేసీబీ వాహనాల ప్రారంభం

-నగర పారిశుధ్య నిర్వహణలో మరింత వేగం – ఎంపీ కేశినేని శివనాథ్ -అభివృద్ధి పనులతో సెంట్రల్ నియోజకవర్గానికి కొత్త రూపు – ఎమ్మెల్యే బోండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అజిత్ సింగ్ నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్‌లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 జేసీబీ వాహనాలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు, …

Read More »

విజయవాడను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడను పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ, వెటర్నరీ కాలనీ, శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీ, ఫిలిం కాలనీ, భారతి నగర్, గురునానక్ కాలనీ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలలో పారిశుధ్యం, రహదారుల పరిస్థితి, మరుగుదొడ్ల నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలను అధికారులతో కలిసి …

Read More »

20 లక్షల ఉద్యోగాల లక్ష్య సాధనకు ఎంఎస్ఎంఈలు కీలకం

-“మేడ్ ఇన్ ఆంధ్ర – మేడ్ ఫర్ ఇండియా – మేడ్ ఫర్ ది వరల్డ్” మన లక్ష్యం -23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలు కల్పించే 800 ప్రాజెక్టులతో ఒప్పందాలు -మూడు నెలల్లో 100 కంపెనీలు ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యేలా ఎంఎస్ఎంఈ శాఖ పని చేయాలి -ఎన్ఎస్ఈ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సిఐఐ నిర్వహించిన ఎస్ఎంఈ ఐపిఓ అవగాహన సదస్సులో మంత్రి నారా లోకేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల …

Read More »

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

-త్వరలో ప్రత్యేక SME IPO స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు -మే 25న రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల ప్రారంభం -ఒక కుటుంబం – ఒక వ్యాపారవేత్త’ విధానంతో పారిశ్రామికాభివృద్ధి -రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఎమ్ఎస్ఎమ్ఈ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖ ల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. …

Read More »

విద్యా వెలుగులు నింపుతున్న “బడి పిలుస్తుంది” చైతన్య విద్యారథం

-విజయవాడ ఈస్ట్‌లో విద్యా చైతన్య ర్యాలీకి విశేష స్పందన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్న “బడి పిలుస్తుంది చైతన్య విద్యారథం” కార్యక్రమం బుధవారం విజయవాడ ఈస్ట్ పరిధిలో ఉత్సాహభరితంగా కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ, ఏపీసీ ఆర్.రమేష్ బాబు పాల్గొని విద్య ప్రాముఖ్యత, ప్రతి చిన్నారి బడికి వెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. …

Read More »

పిల్లల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం

-ఎన్టీఆర్ జిల్లాలో 50 సమ్మర్ స్పోర్ట్స్ కోచింగ్ క్యాంపుల నిర్వహణ -పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న 50 సమ్మర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచింగ్ క్యాంపులకు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రీడల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని …

Read More »

ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిజం రంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మీడియా ప్రతినిదులు 2025-26సంవత్సరానికి గాను అవార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ అన్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవార్డుల ఎంపిక, ప్రదానం కోసం మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ ఛైర్మన్ గా నలుగురు సభ్యులతో కూడిన …

Read More »

సుజనా కార్యాలయంలో బియ్యం అందచేత…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేజ్లోనిపేట 35 వ డివిజన్ కు చెందిన దువ్వాడ అర్ధ నారీశ్వరరావు అనారోగ్య సమస్య తో ఇటీవల మృతి చెందాడు.. అతని పెద కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సాయం కోరారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ చేతుల మీదుగా ఆ కుటుంబ సభ్యులకు 3 బస్తాల బియ్యం అంద చేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే సుజనా చౌదరి కి కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

అగ్నిమాపక చర్యలు పాటించనందుకు బబ్బురి గ్రౌండ్స్ లో గ్యాస్ సిలిండర్ సీజ్ చేసిన విఎంసి ఫైర్ సిబ్బంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్నిమాపక చర్యలు పాటించనందుకు బబ్బురి గ్రౌండ్స్ లో గల గ్యాస్ సిలిండర్ ను సీజ్ చేశారు విఎంసి ఫైర్ సిబ్బంది. బుధవారం సాయంత్రం బబ్బురి గ్రౌండ్స్, భవానిపురం నందు విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి సిబ్బంది తో ఆకస్మికంగా తనఖి నిర్వహించారు. ఈ పర్యటనలో కామన్ కిచెన్ ఉన్నపటికీ అమ్యూజ్మెంట్స్ వద్ద, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉండే ప్రదేశాలలో వంట చేస్తున్నడం గమనించి, అవి అగ్ని ప్రమాదానికి దారి తీసే …

Read More »

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం

-సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని అమ్మితే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీశ ఆదేశాల మేరకు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా, నగర పరిధిలో గల అన్ని డివిజన్లో విస్తృతంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం పై డ్రైవ్ నిర్వహించి 15 కేజీ ప్లాస్టిక్ ని సీజ్ చేశారని, వ్యాపారస్తులు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్మితే వారి ట్రైన్ …

Read More »