విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (MSME)పై పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల తీవ్ర ప్రభావాన్ని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అత్యవసరంగా తీసుకువెళ్లింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో దాదాపు 90% వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు అమ్మకాలు తగ్గడం మరియు ఎగుమతులు క్షీణించడం వల్ల తీవ్ర అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని ఏపీ ఛాంబర్స్ పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు (సీఫుడ్), మామిడి గుజ్జు, …
Read More »Tag Archives: vijayawada
ఎన్టీఆర్ భవన్లో వైభవంగా సీఎం నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సోమవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కేశినేని చిన్ని మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కార్యకర్తల కోలాహలంతో పండుగలా సాగింది. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు బొప్పాన భవ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను వారు …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు కేక్ లు కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి కి దార్శనికుడు అని చంద్రబాబు ను కొనియాడారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ , ఏదుపాటి రామయ్య , మాజీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, మహదేవపు అప్పాజీ, అతులూరి పెద్ద బాబు , జనసేన నాయకుడు …
Read More »భూగర్భజలశాఖ సంచాలకులుగా కె.ఎస్.శాస్త్రి నియామకం
-నేడు బాధ్యతలు స్వీకరించిన నూతన డైరక్టర్ కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర భూగర్భ జలశాఖ, జలగణన శాఖ నూతన సంచాలకులుగా కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ శాఖలో సంయుక్త సంచాలకులుగా సేవలందిస్తున్న కె.ఎస్.శాస్త్రికి పదోన్నతి కల్పించి సంచాలకులుగా నియమిస్తూ రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఈనెల 16న ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు విజయవాడలోని హనుమాన్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన సంచాలకులుగా …
Read More »అప్రమత్తతే అగ్ని ప్రమాదాల నివారణకు కీలకం
-ఘనంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు -అవగాహనతోనే అగ్ని ప్రమాదాల నివారణ – ప్రజల సహకారం కీలకం -అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్) తెలిపారు. స్థానిక బందరు రోడ్డు లోని పివిపి షాపింగ్ మాల్ లో అగ్ని మాపక …
Read More »ప్రతీ జిల్లాకు ఐదు చొప్పున పశువసతి గృహాలు..
-పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పశుపోషకులకు ఆర్థిక సాధికారత.. -పశువసతి కేంద్రానికి పది లక్షల అంచనా వ్యయం అరెకరం స్థలం కేటాయింపు.. -పసుకిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 3 లక్షల వరకూ రుణ సదుపాయం.. -ప్రైవేట్ వడ్డీ రుణభారం నుండి పశుపోషకులకు విముక్తి.. -పశువసతి గృహాల ద్వారా నిరాశ్రయ పశువులకు ఆశ్రయం, పోషణ మరియు వైద్య సేవలు.. -పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులు …
Read More »నీట్ (యూజీ) పరీక్ష నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
– ఎక్కడా లోటుపాట్లు లేకుండా సమన్వయంతో పనిచేయండి – పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 మే 3వ తేదీన జరగనుందని.. పరీక్ష నిర్వహణకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్షపై కలెక్టర్ లక్ష్మీశ సోమవారం సమన్వయ శాఖల అధికారులు, సూపరింటెండెంట్లు, పరీక్షా కేంద్రాల పర్యవేక్షకులతో …
Read More »ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టండి
– సమస్యకు నాణ్యమైన పరిష్కారానికి కృషిచేయాలి – జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 113 అర్జీలు – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి నాణ్యతతో సమస్య పరిష్కారానికి కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీశ సోమవారం జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ …
Read More »ఈ నెల 21న సైనిక సంక్షేమంపై అవగాహన సదస్సు
– సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ – జిల్లా సైనిక సంక్షేమ అధికారి వై.ఈశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మద్రాస్ రెజిమెంటల్ సెంటర్ (ఎంఆర్సీ) రికార్డుకు సంబంధించిన మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువుల సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు ఈ నెల 21న మద్రాసు రెజిమెంటల్ సెంటర్ ద్వారా అవగాహన సదస్సు జరగనుందని జిల్లా సైనిక సంక్షేమ అధికారి వై.ఈశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మద్రాసు రెజిమెంట్కు చెందిన మాజీ సైనికులు, మాజీ సైనికుల వితంతువులు …
Read More »ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు అన్నారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలని …
Read More »
Prajavartha Online Telugu News