Breaking News

Tag Archives: vijayawada

సురక్షిత మౌలిక వసతులు పై జిల్లా స్థాయి లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్ లో గల ఫార్మర్స్ ట్రైనింగ్ హాల్‌లో మంగళవారం *విజయవాడ లో స్కూలలో మరియు హాస్టలలో బాలికల భద్రతా మార్గదర్శకాలు మరియు సురక్షిత మౌలిక వసతులు పై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, హాస్టల్ వార్డెన్లు మరియు కస్తూరిబా గాంధీజీ బాలికల విద్యాలయాల ప్రిన్సిపాలకు జిల్లా స్థాయి లో వర్క్‌షాప్ ఘనంగా నిర్వహించబడింది. ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు …

Read More »

27 తేదీలోపు మసీదులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని మసీదు మేనేజింగ్ కమిటీలకు మరియు గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజన్లు తమ మసీదు రిజిస్ట్రేషన్ కోసం మసీదు సంబంధిత ల్యాండ్ డాక్యుమెంట్స్‌తో జిల్లా వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో మసీదుల రిజిస్ట్రేషన్ (UMEED PORTAL) కార్యక్రమం సముచితంగా నిర్వహించబడుతున్నదని జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున, ఎన్టీఆర్ జిల్లాలోని మసీదు మేనేజింగ్ కమిటీలు మరియు గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజన్లు తమ మసీదు రిజిస్ట్రేషన్ …

Read More »

అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 14 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం.

-ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం. -ముస్లిం విద్యార్దులకు కార్పొరేట్ విద్యకు అయ్యే ఖర్చు భరించేందుకు బోర్డ్ అంగీకారం. -ఏటా 500 మందికి ఉచిత విద్య. మొదటి ఏడాది 250 మందికి రెండవ ఏడాది నుంచి 500 మందికి. -తాలిం ఏ హునర్ పేరు తోనే విద్యా పథకం. -షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ …

Read More »

జోనల్ కమిషనర్ రమ్య కీర్తనకు చిరుసత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1 పరిధిలో జోనల్ కమిషనర్ గా సేవలందిచిన రమ్య కీర్తన నరసరావుపేటలోని మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం చే నియమితులై నందున, సర్కిల్ 1 పరిధి లో రమ్యకీర్తన అందించిన సేవలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ …

Read More »

జనగణనకు సన్నద్ధం: ఎన్యుమరేటర్లకు మూడో విడత శిక్షణ ప్రారంభం

-అందరూ స్వీయ గణన లో పాల్గొనండి – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మే 1 నుండి 30, 2026 వరకు నిర్వహించనున్న జనాభా లెక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు ఎన్యుమరేటర్లకు మూడో విడత శిక్షణ అందిస్తున్నామని చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ మరియు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనగణన ప్రక్రియ సక్రమంగా జరిగేలా నగరంలోని మూడు సర్కిళ్లలో జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు …

Read More »

అత్యవసర సమయంలో ప్రాణరక్షణపై శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఫైర్ విభాగం ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా అత్యవసర సమయంలో ప్రాణరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం లబ్బిపేటలోని జిఆర్టి హోటల్‌లో సిబ్బందికి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో హోటల్‌లో ఉన్న సిబ్బంది మరియు అతిథులు సురక్షితంగా బయటకు ఎలా వెళ్లాలి, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఎలా రక్షించాలి వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. హోటల్ …

Read More »

కొండపల్లి బొమ్మలకు విశ్వవ్యాప్త గుర్తింపు తెస్తాం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-మూడు రోజుల పాటు కనువిందు చేసిన ‘కొండపల్లి బొమ్మల పండుగ-2026’ ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్ -కొండపల్లిని అంతర్జాతీయ స్థాయి ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్’గా తీర్చిదిద్దుతామని ప్రకటన -ప్రతి ఏటా ఏప్రిల్ 18 నుండి 20 వరకు అధికారికంగా ఉత్సవాల నిర్వహిస్తామని వెల్లడి -కొండపల్లి సమీప పర్యాటక ప్రాంతాలు కలిపి పర్యాటక సర్క్యూట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం. -వారసత్వ కళాసృష్టి ‘కొండపల్లి బొమ్మ’.. భావితరాలకు ఈ కళను అందిస్తాం: మంత్రి దుర్గేష్ -సహజత్వానికి నిలువుటద్దం కొండపల్లి బొమ్మలు.. ముగింపు వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ …

Read More »

అద‌ర‌హో.. కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండ‌గ‌..

– విజ‌య‌వంతంగా ముగిసిన మూడు రోజుల ఉత్సవాలు – కొండ‌ప‌ల్లి బొమ్మ‌కు, కొండ‌ప‌ల్లి క‌ళాకారుల‌కు కొత్త ఉత్తేజం – చివ‌రి రోజు కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ – రాష్ట్ర స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ సంచాల‌కులు కేఎస్ విశ్వ‌నాథ‌న్‌ – ఆద్యంతం క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించిన మైల‌వ‌రం శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌. ఏపీ నాట‌క అకాడమీ ఛైర్మ‌న్ గుమ్మ‌డి గోపాల‌కృష్ణ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వం …

Read More »

ఆంధ్రుల ఆత్మగౌరవ శిఖరం సీఎం చంద్రబాబు… : మోటూరి శంకర్‌రావు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ… ​తెలుగు రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన ధీశాలి, ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత నారా చంద్రబాబు నాయుడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, తన మేధస్సుతో మరియు కఠోర శ్రమతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన ప్రయాణం ఒక అద్భుత …

Read More »

బ్రిడ్జ్ కోర్స్ చాలా పాఠశాలల్లో జరగనే లేదు…

-మళ్లీ దానికి గ్రాండ్ టెస్ట్ నిర్వహణ మరియు నమోదు కూడానా….? విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయులు పదవ తరగతి పరీక్షలు ఒకవైపు జరుపుతూ మరొకవైపు మూల్యాంకన విధులలో పాల్గొన్న దృష్ట్యా చాలా పాఠశాలల్లో బ్రిడ్జి కోర్స్ జరగనే లేదు.మళ్లీ ఆ కోర్సు కు గ్రాండ్ టెస్టులు పెట్టమనడం ఫలితము లేని నిర్వహణ అని విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకొని ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్.టి.యు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ కోరారు. బ్రిడ్జ్ కోర్స్ పుస్తకాలు …

Read More »