Breaking News

Tag Archives: vijayawada

ఇంద్రకీలాద్రిపై కేరళ డీజీపీ రవాడ ఆజాద్ చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవాడ ఆజాద్ చంద్రశేఖర్, ఐపీఎస్ శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు.అమ్మవారి అంతరాలయంలో డీజీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహుకరించారు.ఈ సందర్భంగా కేరళ డీజీపీ మాట్లాడుతూ.. …

Read More »

మ‌హిళ‌ల ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు చేయూత‌

-స్వ‌యం ఉపాధికి స‌రికొత్త మార్కెటింగ్‌-మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు షాపింగ్ మాల్స్ భ‌రోసా-సామాజిక బాధ్య‌త‌గా తొలి అడుగు వేసిన ఎల్ఈపీఎల్‌-ఎన్‌టీఆర్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, కృష్ణా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేయడానికి, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందుతున్న మహిళలకు మార్కెటింగ్ రంగంలో కొత్త అవకాశాలు కల్పించే దిశగా ఎన్‌టీఆర్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, కృష్ణా క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ చొర‌వ‌తో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్థానికంగా తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులు, ఇతర …

Read More »

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్ లోక్సభలో ఆమోదం పొందినందుకు- కార్పొరేషన్ లో వేడుకలు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్ లోక్సభలో ఆమోదం పొందినందుకు  విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో  వేడుకలు నిర్వహించారు.  ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కు చట్టబద్ధత బిల్ లోక్సభ ఆమోదం పలికినందుకు ఈ వేడుకలు జరుపుకుంటున్నామని, నగరంలోని జోనల్ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, వసతి గృహాలులో కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీంద్రరావు, …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :  సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతోఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ కుమార్ సౌజన్యంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎండ తీవ్రతకి ఇబ్బంది పాదచారులకి మా వంతుగా డొక్కా సీతమ్మ కమిటీ మెంబర్స్ అందరం ఎప్పుడు పేదలకు సేవ చేయడానికి ముందుకు వస్తాం ప్రజలకు ఎప్పుడూ ఏమీ అవసరమో వాటిని మా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆలోచించి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఆకలితో ఉన్నవారికి,దప్పికతో ఉన్నవారికి మా …

Read More »

“త్యాగం, ప్రేమ, క్షమ కలిగి ఉండాలి ఇదే గుడ్ ఫ్రైడే సందేశం.”

-టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడ్ ఫ్రైడే అనేది మానవాళి కోసం యేసు క్రీస్తు చేసిన త్యాగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజు అని, ప్రపంచానికి ప్రేమ, క్షమ, త్యాగం అనే గొప్ప విలువలను యేసు క్రీస్తు తన జీవితం ద్వారా నేర్పించారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 5వ డివిజన్ క్రీస్తురాజపురంలోని IPC చర్చిలో ఫాస్టర్ సొంగ అబ్రహం నెత్రుత్వంలో జరిగిన గుడ్ ఫ్రైడే ప్రార్థన కార్యక్రమంలో టిడిపి నాయకులు గద్దె క్రాంతి కుమార్ పాల్గొని, క్రైస్తవ …

Read More »

టి.డి. జనార్ధన్ కి 69వ జన్మదినం శుభాకాంక్షలు… : మోటూరి శంకర్‌రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు మరియు పొలిటికల్ సెక్రెటరీ టి.డి. జనార్ధన్ కి ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నగరంలోని తమ కార్యాలయంలో మోటూరి శంకర్‌రావు మాట్లాడుతూ టి.డి. జనార్ధన్ పార్టీలో సీనియర్ నాయకులని, దశాబ్దాలుగా పార్టీకి మరియు ప్రభుత్వానికి సేవలు అందించడమే కాకుండా, మాజీ సైనికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని సుమారు 2,50,000 పైచిలుకు మాజీ సైనికులు, …

Read More »

కేడీసీసీ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌ల పాత్ర కీలకం

– కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా జిల్లా సొసైటీ చైర్మన్‌ల మహాజనసభలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురాం గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ అభివృద్ధిలో సొసైటీ చైర్మన్‌లు మరియు సభ్య సంఘాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన సహకార బ్యాంకింగ్ …

Read More »

వేసవిలో ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు

– అధికార యంత్రాంగం పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉంది – చందాపురం ఘ‌ట‌న‌పై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా వేస‌వి నేప‌థ్యంలో ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించామ‌ని.. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పూర్తి అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శ‌నివారం క్షేత్ర ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా చందాపురం గ్రామాన్ని సంద‌ర్శించి.. వైద్య ఆరోగ్యం, పంచాయ‌తీరాజ్, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల …

Read More »

ఆర్థిక సాధికార‌త‌కు స్వ‌యం ఉపాధి చేయూత‌

– రైజ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్‌షాప్‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోండి -జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు, సుస్థిర భ‌విష్య‌త్తుకు స్వ‌యం ఉపాధి మార్గాలు చేయూత‌నిస్తాయ‌ని ఈ నేప‌థ్యంలో రైజ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్‌షాప్‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శ‌నివారం గుంటుప‌ల్లిలోని రైజ్ కేంద్రం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న టైల‌రింగ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. రోజుకు రెండు బ్యాచ్‌లు చొప్పున 30 రోజుల పాటు జ‌రిగే శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో …

Read More »

ఆల్ ఇండియా కెనరా బ్యాంక్ జ్యూయల్ అప్రైజర్స్ యూనియన్ జనరల్ సెక్రెటరీ గా ఈదరాడ శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ అభినందన సభ జరిగింది. శనివారం విజయవాడ భవానిపురం శుభమస్తు కళ్యాణ వేదిక నందు ఆలిండియా కెనరా బ్యాంక్ జ్యూయల్ అప్రైజర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన ఈదరాడ శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ కెనరా బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈదరాడ శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించుకుని సన్మానించారు. తదుపరి వక్తలు ప్రసంగిస్తూ ఈదరాడ శ్రీనివాస్ జ్యూయల్ అప్రైజర్స్ కి అందించినటువంటి …

Read More »