విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేరళ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవాడ ఆజాద్ చంద్రశేఖర్, ఐపీఎస్ శనివారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మరియు అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అమ్మవారి అంతరాలయంలో డీజీపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా కేరళ డీజీపీ మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, భక్తుల కోసం ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడారు. లోకకళ్యాణం కోసం, అందరూ క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News