Breaking News

Daily Archives: May 2, 2026

వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోండి

– ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి సూచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శస్త్ర చికిత్స చేయించుకున్న క్రమంలో వైద్యుల సూచనలు పాటిస్తూ విశ్రాంతి తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఆయనకు పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల స్వాగతం పలికారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ని పరామర్శించారు. – శస్త్ర …

Read More »

కాలువల మరమ్మత్తు, పూడికతీతల కోసం 397 కోట్లు విడుదల.

-10లక్షల లోపు పనులకు నామినేషన్ పద్దతిలో చేపట్టాలి. -సీజన్ మొదలయ్యేలోగా పనులు పూర్తవ్వాలి. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రూ. 397 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులన్నీ వచ్చే ఖరీఫ్ కు ముందే పూర్తి చేసి తీరుతామన్నారు. ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో కేవలం 200 కోట్లు మాత్రమే కాలువల …

Read More »

పోలీసుల‌కు ఆర్టీజీఎస్ సాంకేతిక తోడ్పాటు

-కేసుల ఛేద‌న‌లో స‌హ‌కారం కీల‌క స‌హ‌కారం అందిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ360 -అదృశ్య‌మైన ముగ్గురు మ‌హిళల ఆచూకీ ల‌భ్యం -హ‌త్య‌, దోపిడీ కేసులో నిందితుడిని ప‌ట్టించిన టెక్నాల‌జీ -వాహ‌న చోరీ కేసు చేధ‌న‌లోకూ కీల‌క పాత్ర‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ కేసుల ద‌ర్యాప్తులో పోలీసుల‌కు రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ త‌న‌దైన సాంకేతిక తోడ్పాటు అందిస్తూ కేసుల ఛేద‌న‌లో పోలీసుల‌కు త‌గినంత స‌హ‌కారం అందిస్తోంది. తాజాగా ఐదు కేసుల్లో ఆర్టీజీఎస్ సీసీటీవీ360 వ్య‌వ‌స్థ కీల‌క‌పాత్ర పోషించి ఈ కేసుల ద‌ర్యాప్తులో పోలీసుల …

Read More »

కొబ్బ‌రి అధారిత ఉత్ప‌త్తుల‌తో అద‌న‌పు ఆదాయం ద‌క్కేలా ప్ర‌ణాళిక‌లు

– మంత్రి కొండ‌ప‌ల్లి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ, రాష్ట్రంలో కొబ్బరి రైతులకు, రైతు ఉత్పత్తులకు అదనపు ఆదాయం చేకూర్చేలా భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొబ్బరి సాగు ఎక్కువగా ఉన్న మన రాష్ట్రంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి అధారిత ఉత్ప‌త్తుల‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని పొల్లాచ్చిలో గల ‘ఎకో కాయిర్ క్లస్టర్ ఇండియా …

Read More »

45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శనివారం ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మొత్తం 28 జిల్లాలకు గాను 17 జిల్లాల పరిధిలోని 239 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపి 41 డిగ్రీలకు పైగా నమోదైనట్లు వెల్లడించారు. కడప జిల్లా 34 మండలాలు, నెల్లూరు 32, తిరుపతి 29, పల్నాడు 26, ప్రకాశం 25, మార్కాపురం 21, నంద్యాల20 , కర్నూలు17, చిత్తూరు జిల్లా …

Read More »

చేనేతల లోగిళ్లలో ‘ఉచిత’ కాంతులు

-గత నెల 1 నుంచి ఉచిత విద్యుత్ అమలు -మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు -మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేత -జీరో పేమెంట్ తో మే నెల విద్యుత్ బిల్లుల రాక -నేతన్నల కుటుంబాల్లో హర్షాతిరేకాలు -‘ఉచిత విద్యుత్’తో ఆర్థిక మేలు -సీఎం చంద్రబాబుకు ,మంత్రి లోకేశ్ కు చేనేతల ధన్యవాదాలు -నేతన్నలకు ఏడాది ఉపాధే లక్ష్యం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇచ్చిన మాటకు కట్టుబడుతూ కూటమి ప్రభుత్వం నెరవేర్చిన హామీ నేతన్నల …

Read More »

APCRDA ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ చర్యలపై శిక్షణ కార్యక్రమం నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో 2026 మే 2న హీట్ వేవ్/ వడదెబ్బ/ వడగాడ్పుల నివారణ చర్యలపై అవగాహన & సామర్థ్య పెంపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. APCRDA అధికారులు, OHS మేనేజర్లు, పర్యావరణ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్(PMCs), కాంట్రాక్టర్లు, అలాగే PgMC, APCRDA, ADCL సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా వచ్చే ప్రమాదాలపై అవగాహన పెంచడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం & …

Read More »

కుటుంబ, గృహ గణన (జనగణన) కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి

-జన గణన సందర్భంగా అందించిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ, గృహ గణన (జనగణన) కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ పేర్కొన్నారు. జన గణన (గృహ గణన) నిర్వహణలో భాగంగా ఆవిలాల పంచాయతీ లోని శ్రీనివాస నగర్ లో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన 2027 కార్యక్రమాన్ని …

Read More »

పేటవరువ కాలువ పునరుద్ధరణ పనులతో.. ఉద్యాన పంటల సాగుకు ఆస్కారం

-జలధార- జలహారతి ద్వారా తొండమనాడు పంచాయతీ లో 28 నీటి సంరక్షణ పనులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు పూడికతో మూసుకుపోయి నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన కాలువలు… నేడు మళ్లీ జీవం పొందే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు కొత్త దిశను చూపిస్తోంది. తిరుపతి జిల్లాలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో తొండమనాడు చెరువు నుండి పేటవరువ కాలువ పనులు కేవలం నీటి వనరుల పునరుద్ధరణకే పరిమితం కాకుండా, …

Read More »

అర్హులందరికీ విద్యుత్ సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోండి

-తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశం శనివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబడింది. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ ఎస్.ఈ, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నారాయణవనం పవర్ లూమ్స్ సమస్య, చిట్టమూరు …

Read More »