-తొలి ఏకాదశి సందర్భంగా వికృతమాల శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా వేద పారాయణం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా వికృతమాల గ్రామంలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలను ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ …
Read More »Konduri Srinivasa Rao
పొగాకు రైతులను ఆదుకోవాలి… సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
-రైతుల సంక్షేమానికి హై ప్రయార్టీ… సమస్య పరిష్కారానికి బయ్యర్లూ సహకరించాలి -సీఎం చంద్రబాబుతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ, డైరెక్టర్ల భేటీ -నిరంతర సంప్రదింపులతో వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధులను రాష్ట్రానికి పంపిన కేంద్రం -పొగాకు రైతులను ఆదుకునేలా 3 ప్రతిపాదనలు సిద్దం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పొగాకు రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వంతో సీఎం చంద్రబాబు చేపడుతున్న నిరంతర సంప్రదింపులతో రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టి సారించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ …
Read More »మీ ఆరోగ్యం… మీ బాధ్యత
-సంజీవనిని సద్వినియోగం చేసుకోండి -ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి సంజీవని -ప్రజారోగ్యం-ప్రజా సంక్షేమం-అభివృద్ధి కూటమి ప్రభుత్వ బాధ్యత -గొడ్డలి పార్టీ నేతలు పగటి వేషగాళ్లు-ఒక్క ఎకరాకు నీరివ్వలేదు… ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు -ఆస్పరిలో సంజీవని కార్యక్రమం బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా/ఆలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని…ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీ ఆరోగ్యం… మీ …
Read More »వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్కు మార్గం
-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాస్త్రీయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ వ్యవసాయం అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. శనివారం బాపట్లలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) 58వ వార్షిక స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్, పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత ఆరు దశాబ్దాలుగా …
Read More »ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినైనా ఉపేక్షించం
-అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు -ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు -’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్ అరణ్య ద్వారా …
Read More »అంగరంగ వైభవంగా తెలుగు మహోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ‘తెలుగు మహోత్సవం’ రెండు రోజుల వేడుకలు గుంటూరు జిల్లాలోని చారిత్రక ఉండవల్లి గుహల వద్ద జూలై 25న అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి గుహలు నందు ఉదయం 6.30 ని.లకు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గాత్ర విద్యార్థులచే తెలుగు భక్తి మరియు సాహిత్య …
Read More »ఆగస్టు 1న భారత గౌరవ ప్రధాని చేతుల మీదుగా “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” ప్రారంభోత్సవం
-“ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు” పేరుతో ఆరు జిల్లాల్లో జులై 25 నుండి ఆగస్టు 1 వరకు వారం రోజుల పాటు వేడుకలు…. -విమానాశ్రయ ప్రారంభోత్సవ శుభ సమయాన్ని పంచుకునెలా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల ముఖ్య కేంద్రాలలో “కౌంట్డౌన్ డిజిటల్ స్క్రీన్లు” ఏర్పాట్లు. -సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజాకాంక్షలు, సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు …
Read More »వైసీపి బకాయి పెట్టిన 1,900 కోట్ల బీమా ప్రీమియాన్ని విడతలవారీగా చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ హామీతో బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
– ఖరీఫ్-2024 పంటల బీమా నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి: మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న సుమారు రూ.1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇవ్వడంతో ఖరీఫ్-2024 పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను కలిసి …
Read More »వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్
-మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ దిశగా అడుగులు -రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ వనరుల సాయంతో లక్షల విత్తన బంతులు వెదజల్లే పక్రియ పూర్తి -30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధితో పూర్తి చేయాలన్న పవన్ కళ్యాణ్ -సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి -సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమంపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్షపాతం, నేలలో తేమ …
Read More »మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి
-ఫించన్ పెంచాలి -క్యాష్ లెస్ వైద్య సదుపాయం కల్పించాలి -*ప్రోటోకాల్ పాటించాలి -ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న సౌకర్యాలు గౌరవం కల్పించాలి -మందులు ఇక నుండి కొరియార్ ద్వారా ఇంటివద్దకే అందించాలి -అసెంబ్లీ ఆవరణలో ఏపీ ఫార్మర్ లెజిస్ట్రేటర్స్ ఫోరమ్ జనరల్ బాడీ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఫార్మర్ లెజిస్ట్రేటర్స్ ఫోరమ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఫోరమ్ జనరల్ బాడీ సమావేశం అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు.ముందుగా ఇటీవల …
Read More »
Prajavartha Online Telugu News