Breaking News

Konduri Srinivasa Rao

వ‌ర్జినీయా పొగాకు రైతులు, కంపెనీల సమన్వయంతోనే మార్కెట్‌కు స్థిరత్వం

– కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ.. కేంద్ర ప్ర‌భుత్వంతో విస్తృత చర్చలు – ఎగుమతిదారులకు వడ్డీ రాయితీ ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రం – రోజువారీ కొనుగోళ్లు 150 బేళ్ల నుంచి 700 బేళ్లకు పెరుగుదల… త్వరలో 1200 బేళ్ల లక్ష్యం – రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్‌కు తీసుకురావాలి: మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి …

Read More »

12 ఏళ్ల ప్ర‌ధాని శ్రీ మోడీ నాయ‌క‌త్వంలో న‌వ భార‌తం

-ప్ర‌ధానిగా రికార్డు దేశ ప్ర‌జ‌ల విశ్వాసానికి ప్ర‌తీక‌ -స‌మ‌ర్ధ నాయ‌క‌త్వంతో దేశ గ‌తిని మార్చిన శ్రీ మోడీ -ప్ర‌ధాని మోడీ రికార్డు దేశానికి హిత‌మ‌న్న వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికైన ప్ర‌ధాన మంత్రుల్లో అత్య‌ధిక కాలం ప‌ద‌విలో ఉన్న ప్ర‌ధానిగా న‌రేంద్ర మోడీ బుధ‌వారం రికార్డు నెల‌కొల్పడం న‌వ భార‌త ఆవిష్క‌ర‌ణ‌కు శుభ సూచ‌క‌మ‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. మే 26, 2014న ప్ర‌ధానిగా ప్ర‌మాణం స్వీకారం చేసిన మోడీ …

Read More »

5 లక్షలకు చేరిన యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు

-రోజురోజుకి పెరుగుతోన్న ఔత్సాహికులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర-2026 రిజిస్ట్రేషన్లు ఐదు లక్షలకు చేరుకున్నాయి. ఈ నెల 7 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా 3 రోజుల వ్యవధిలోనే ఐదు లక్షలకు చేరుకోవడం విశేషం. తొలిరోజు 25వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. సోమవారం నుంచి ఈ సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. యోగాసనాల్లో కోటి మందిని భాగస్వాములను చేయాలని సీఎం శ్రీ చంద్రబాబు జారీచేసిన ఆదేశాలు అనుసరించి యోగాంధ్ర పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కనిపిస్తోన్న సానుకూల …

Read More »

392 కొత్త వైద్యుల పోస్టింగుల కోసం వెబ్ కౌన్సెలింగ్!

-పారదర్శకత చర్యల్లో భాగంగా తొలిసారిగా అమలు -20వ తేదీలోగా విధుల్లో చేరేలా 12న పోస్టింగు ఉత్తర్వులు -ఎన్. హెచ్. ఎo.నోటిఫికేషన్ ద్వారా నియామకాలు -రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్. చ్. ఎం.) కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగులు ఇస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ …

Read More »

వైసీపీ విష ప్రచారాలను రైతులు నమ్మొద్దు.. దుష్ప్రచారం చేస్తే జైలుకే: మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చ‌రిక‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తోత‌పూరి మామిడి రైతులను తప్పుదోవ పట్టిస్తూ వైసీపీ అనుబంధ సోషల్ మీడియా వర్గాలు, కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చేస్తున్న విష ప్రచారాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి కొనుగోళ్లు, పల్ప్ పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికల్లో అసత్యాలు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. రైతుల్లో అయోమయం సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో …

Read More »

జూన్ 18, 19 తేదీల్లో పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ సమీక్ష సమావేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజా రంగ సంస్థల కమిటీ (Committee on Public Undertakings) సమావేశాలు ఈ నెల 18 మరియు 19 తేదీలలో అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయ కమిటీ హాల్-1 లో నిర్వహించనున్నట్లు శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సమావేశంలో సంబంధిత అథారిటీలు, కార్పొరేషన్ల స్థాపన లక్ష్యాలు, ఆర్థిక పరిస్థితి, ఆస్తులు–అప్పులు, సంస్థల కార్యకలాపాలు, సాధించిన విజయాలు, సిబ్బంది వివరాలు, ఖాళీలు, రోస్టర్ అమలు …

Read More »

నాలుగు రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు సమక్రమమే : రిటర్నింగ్ అధికారి వణితా రాణి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యసభ ఎంపి ఎన్నికలకు సంబంధించి నలుగురు అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు సక్రమంగా ఉండడంతో వాటిని ఆమోదించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వణితా రాణి వెల్లడించారు.మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం జరిగింది.రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా తెలుగుదేశం పార్టీ తరుపున చింతకాయల విజయ్,బాష్యం రామకృష్ణ,సానా సతీష్,జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ లు దాఖలు చేసిన నామినేష్లను సమక్రమంగా ఉండడంతో పరిశీలన అనంతరం నలుగురు అభ్యర్దుల నామినేషన్లను ఆమోదించినట్టు ఆమె వెల్లడించారు. …

Read More »

రొయ్యల రైతుల సంక్షేమం, ఆక్వాకల్చర్ రంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

– ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారంతో ముందుకు రావాలి – అదనంగా 12 వేల ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్‌కు రూ.1.50 రాయితీ – ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, …

Read More »

రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు

-10,11 తేదీల్లో ఢిల్లీలోనే ఉండనున్న ముఖ్యమంత్రి -ఎన్డీఎ, నీతి ఆయోగ్ సమావేశాల్లో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనుకు ఢిల్లీ వెళుతున్నారు. జూన్ 10, 11వ తేదీల్లో సీఎం ఢిల్లీలో ఉండనున్నారు. 10వ తేదీ బుధవారం ఉదయం 11.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి రాత్రి …

Read More »

సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక ఆవిష్కరన

-సహకారభూమి తృతీయ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని వీరాంజనేయులు, ఎండీ ఆర్.వి. రామకృష్ణ, నాబార్డ్ డిజిఎం ఎం.ఎస్.ఆర్. చంద్ర మూర్తి తదితరులు సభలో ప్రసంగిస్తున్న ఆప్కాబ్ చైర్‌పర్సన్ గన్ని -‘సహకారభూమి’ మనుగడకు సంపూర్ణంగా సహకరిస్తాం -సహకార వ్యవస్థకు ఓ దిక్సూచి ఈ పత్రిక -ఆప్కాబ్ చైర్మన్ గన్ని, ఎండీ రామకృష్ణ భరోసా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగం విలువలు, విశిష్టత, సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిస్వార్థంగా కృషిచేస్తున్న ‘సహకారభూమి’ పక్షపత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ …

Read More »