Breaking News

Monthly Archives: August 2026

తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టండి

-రవాణా శాఖలో అనవసర నిబంధనలు తొలగించండి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్ నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టిపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను, రిజర్వాయర్లలో, నీటి వనరుల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సోమవారం వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఎగువన వర్షాలు …

Read More »

పొగాకు రైతులను ఆదుకోలేని జగన్‌కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు: మంత్రి అచ్చెన్నాయుడు

– జగన్ హయాంలో రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించింది – కూటమి ప్రభుత్వం రైతులకు భరోసాగా నిలిచింది అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల సంక్షేమం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడటం జగన్ మోహన్ రెడ్డికి ఏమాత్రం తగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఐదేళ్ల పాలనలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా వారికి అండగా నిలవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా …

Read More »

గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌ పనుల్లో వేగం పెంచండి

-2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి -గత రెండేళ్లలో మడ అడవుల విస్తరణలో దేశంలో ద్వితీయ స్థానం సాధించాం -ఈ ఏడాది మరింత బాధ్యతగా మడ అడవుల పెంపకం చేపట్టాలి -తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజా భాగస్వామ్యం పెరగాలి -రాష్ట్రవ్యాప్తంగా 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక -వీబీ జీ రాం జీ పథకంలో భాగంగా తీర ప్రాంత జిల్లాలకు మరో 70 లక్షల మొక్కలు -గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో పురోగతిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి …

Read More »

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం–2026 ప్రత్యేక ముందస్తు వేడుకలను ఈ నెల 5వ తేదీ (బుధవారం) సాయంత్రం 4.00 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు విజయవాడ చేనేత సేవా కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రాత్మకమైన 1905 స్వదేశీ ఉద్యమం స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతీయ చేనేత వారసత్వ పరిరక్షణలో చేనేత కళాకారులు అందిస్తున్న విశిష్ట సేవలను గౌరవించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం …

Read More »

అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌పై సానుకూల ముందడుగు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఐ&పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్‌ను కలిసి, సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ నుంచి పొందిన లీగల్ ఒపీనియన్ ను సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన న్యాయపరమైన, విధానపరమైన అంశాలను డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, ఈ అంశాన్ని సంబంధిత అధికారుల దృష్టికి చేర్చాలని కోరారు. సొసైటీ ప్రతినిధుల వినతిపై ఐ&పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ చాలా సానుకూలంగా స్పందించారు. …

Read More »

అర్హులందరికీ ‘నేతన్న సేవలో..’

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -ఏటా చేనేతలకు రూ.25 వేల ఆర్థిక సాయం -ఈ నెల 7 నుంచి పథకం అమలు -5 తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు తుది గడువు -గడువులోగా చేనేతలు దరఖాస్తులు చేసుకోవాలి -ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా ‘నేతన్న సేవలో…’ అమలు చేస్తున్నాం -చేనేతల గౌరవప్రదమైన జీవనమే సీఎం చంద్రబాబు లక్ష్యం -పథకం అమలులో ఆరోపణలకు, విమర్శలకు తావివ్వొద్దు -7న చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు -హాజరుకానున్న సీఎం చంద్రబాబు -చేనేత, జౌళి …

Read More »

అద్దంకి ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారమే లక్ష్యం

-101.96 కోట్లతో రక్షిత మంచినీటి పథకం -83 కిమీ నీటి సరఫరా పైప్‌లైన్, 15 కిమీ ఫీడర్ ఛానెల్ -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : అద్దంకి పట్టణ ప్రజలకు దీర్ఘకాలికంగా తాగునీరు అందించే లక్ష్యంతో రక్షిత మంచినీటి పథకం పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమారు …

Read More »

నిరుద్యోగ యువత కోసం

-28న ధర్మవరంలో మెగా జాబ్ మేళా -పోస్టర్ని ఆవిష్కరించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ -ఉద్యోగాల కోసం తిరగాల్సిన అవసరం లేదు… కంపెనీలనే ధర్మవరానికి తీసుకొస్తున్నాం – మంత్రి సత్యకుమార్ యాదవ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యోజనతో నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర …

Read More »

ఆరోగ్య శాఖ పేరుతో ఉద్యోగాల మోసం!

-నకిలీ నియామక లేఖలపై సీఐడీకి ఫిర్యాదు -డబ్బులు అడిగితే నమ్మొద్దని నిరుద్యోగులకు అధికారుల హెచ్చరిక అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ నియామకాల మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ చిహ్నాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముద్రలు, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పేరు, మంగళగిరిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ చిరునామాను అక్రమంగా ఉపయోగించి నకిలీ నియామక ప్రకటనలు, ఇంటర్వ్యూ కాల్ లెటర్లు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు రూపొందించి నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు …

Read More »

ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం లెక్కలు తేల్చాలని మంత్రి ఆదేశం

-కోవిడ్ -19 తర్వాత భారీగా పెరిగిన ఆక్సిజన్ కొనుగోలు -పలు కారణాలతో రూ.105 కోట్లతో నిర్మిత‌మై, నిరుపయోగంగా ఉన్న 161 పీఎస్ఏ ప్లాంట్లు -ఆసుపత్రుల్లో అక్సిజన్ సరఫరా, వినియోగాన్ని అధ్యయనం చేసి సిఫార‌సులు చేయడానికి కమిటీ ఏర్పాటు -మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ వెల్లడి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం దాదాపు రూ.105 కోట్లతో నిర్మితమై నిరుపయోగంగా మారిన పీఎస్ఏ ( ప్రెష‌ర్ స్వింగ్ అడ్సార్ప‌ష‌న్ ) ప్లాంట్లు, అధిక మోతాదులో ఎల్ఎంఓ (లిక్విడ్ …

Read More »