Breaking News

Monthly Archives: August 2026

ఘనంగా కాకాని వెంకటరత్నం, కాకాని తరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక బెంచ్ సర్కిల్‌లోని కాకాని వెంకటరత్నం విగ్రహం వద్ద సోమవారం ఆయన 126వ జయంతి మరియు కాకాని తరుణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ’20 సూత్రాల పథకం’ చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథిగా, ఆంధ్ర క్రికెట్ అకాడమీ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దొడ్డపనేని గౌరవ అతిథిగా హాజరయ్యారు. వీధి వ్యాపారి లక్ష్మమ్మకు ఉక్కుతో చేసిన పండ్ల రసం (జ్యూస్) తయారీ బండిని బహుకరించారు. అలాగే, 100 మందికి పైగా పేదలకు …

Read More »

తీవ్ర వాతావరణ పరిస్థితులతో కార్మికుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వివరాలు కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలు, వడగాల్పులు, తుఫానులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల అసంఘటిత, దినసరి కూలీలపై పడుతున్న ప్రభావం, వారికి సామాజిక భద్రత కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంభవిస్తున్న తీవ్ర వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ నమోదు చేస్తోందని మంత్రి తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని …

Read More »

అత్యంత వైభవంగా తాతా మనవడి జన్మదినోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య పోరాట సమరయోధుడుగా,ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుడుగా, వ్యవసాయ పశుపషక పారసేకరణ శాఖ మంత్రి గా, జై ఆంధ్ర ఉద్యమంలో కీలక నాయకుడుగా… ప్రజలచే “ఉక్కు కాకాని ” ప్రశంసలందుకున్న ఆ మహా నాయకుని జయంతి సందర్భంగా… అదే వారసత్వ పరంపర అందుకున్న మనవడి కాకాని తరుణ్ జన్మదినోత్సవం కూడా అది రోజు అవడం యాదృచ్ఛికము… మరియు ఆనందదాయకం… ఈరోజు ఠాగూర్ స్మారక గ్రంథాలయం విజయవాడ బందర్ రోడ్డు వద్ద ఘనంగా కాకాని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య …

Read More »

వించిపేట ప్రజలకు రైతుబజారు ప్రారభించేందుకు చర్యలు చేపట్టాలి జి.కోటేశ్వరరావు వినతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వించిపేట ప్రజలకు రైతుబజారుని అందుబాటులోకి తీసుకోని రావాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ, విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భముగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే పాతబస్తీ, వించిపేట ప్రాతంలోని ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు నాణ్యమైన తాజా కూరగాయలు …

Read More »

పశ్చిమ లో ఘనంగా ఎంపీ కేశినేని శివనాద్ ( చిన్ని) జన్మదిన వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్ (చిన్ని) జన్మదిన వేడుకలను సోమవారం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ బీ సీ సెల్ అధ్యక్షుడు ముదిరాజ్ శివాజీ ఆధ్వర్యంలో భవానిపురంలో ఎంపీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో టీడీపీ మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు, టీడీపీ …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను నేరుగా పరిష్కరించేందుకు ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ,ఎన్డీయే కార్యాలయంలో నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’కు విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, నాగోతి రామారావు,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బలివాడ పట్నాయక్ , జనసేన 53 వ డివిజన్ అధ్యక్షులు పులిచేరి రమేష్,బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, దేవిన హరి …

Read More »

కేదారేశ్వరపేట రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం కౌంటర్ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేదారేశ్వరపేట, రైతు బజార్ లో తక్కువ ధరకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రత్యేక విక్రయ కౌంటర్ ను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్ తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌంటర్ లో చేపట్టిన ఏర్పాట్లు పరిశీలించి బియ్యం పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందిస్తోందని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ ఆర్ ఐ శ్రీనివాస్, ఈ …

Read More »

ఎన్డీయే కార్యాలయంలో నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ

-బ్రహ్మకుమారీస్ వారిచే 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ మహా ఉద్యమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు, దేశ యువత ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధాని మోది పిలుపునిచ్చిన నషా ముక్త్ భారత్ అభియాన్ పోస్టర్ ను ఎన్డీయే కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, గాయత్రి పరివార్ శాఖ, బ్రహ్మకుమారీస్ సంస్థతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి సింధూలత మాట్లాడుతూ యువతకు డ్రగ్స్ పీడ వదిలించే దిశగా …

Read More »

రాజధాని అమరావతిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రోజుల పర్యటనలో భాగంగా, ప్రపంచ బ్యాంక్(WB) & ఆసియా అభివృద్ధి బ్యాంక్(ADB) బృందం తొలి రోజు సోమవారం, 2026 ఆగస్టు 3న ప్రజారాజధాని అమరావతిలో పర్యటించింది. పర్యటనలో భాగంగా ఉదయం రాయపూడి APCRDA ప్రధాన కార్యాలయంలో ESMU విభాగ అధికారులతో WB& ADB బృందం సమీక్ష నిర్వహించింది. రాజధాని నిర్మాణ ప్రాజెక్టులలో పాల్గొంటున్న గుత్తేదారు సంస్థలు నిర్వహిస్తున్న క్యాంపు సైట్‌లలో కార్మికుల భద్రతకు అనుసరిస్తున్న విధానాల గురించి ఈ సమీక్షలో చర్చించింది. అలాగే రాజధాని అమరావతి …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు కొల్లాబత్తుల కార్తీక్ IAS, టి.రాహుల్ కుమార్ రెడ్డి IAS కు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. రైతులు, స్థానికుల సౌకర్యార్థం CRDA ప్రధాన కార్యాలయంలో …

Read More »