-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర పర్యవేక్షణలో రహదారి పనుల్లో స్పష్టమైన పురోగతి -అడవితల్లి బాట తొలి దశలో రూ. 1,005 కోట్లతో 1,069 కి.మీ. రహదారుల అభివృద్ధికి శ్రీకారం -అడవితల్లి బాట 2.0 విస్తరణతో మొత్తం రూ. 2,078 కోట్లతో 2,310 కి.మీ. రహదారుల అభివృద్ధి -విస్తరణ పనుల్లో ఇప్పటికే 905 కి.మీ. రహదారుల నిర్మాణం పూర్తి -పెండింగ్ పనులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షించిన ఉపముఖ్యమంత్రి -మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం -అటవీ అనుమతులు జాప్యం లేకుండా …
Read More »Daily Archives: August 7, 2026
నేతన్నల బాగు కోరుకునే ప్రభుత్వం మాది
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -అర్హులైన నేతన్నలందరికీ ‘నేతన్నల సేవలో’ -హామీ ఇవ్వకున్నా ఏటా రూ.25 వేలు ఇస్తున్నాం -చేనేతలు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత చీరాల, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్క నేతన్నకూ నేతన్నల సేవలో పథకం కింద ఏటా రూ. 25 వేలు అందజేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. చేనేతలు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే సీఎం చంద్రబాబు …
Read More »ప్రతి ఔషధ తనిఖీ.. రోగి భద్రత కోసమే
-నాణ్యమైన మందులే ప్రజారోగ్యానికి రక్షణ -విధివిధానాల అమలు, ప్రయోగశాల నియంత్రణలో పటిష్ఠత అవసరం -యూఎస్ ఎఫ్డీఏ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం (యూఎస్ ఎఫ్డీఏ ఇండియా ఆఫీస్ – US FDA India Office) కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ …
Read More »జాబ్ చార్ట్ అమలులో నిర్లక్ష్యానికి ఆస్కారం ఇవ్వకూడదు
-వృత్తిపట్ల నిబద్ధత ఉండాలి -క్రమశిక్షణతో పనిచేయాలి -నూతన ఆయుష్ వైద్యులకు డైరెక్టర్ రోణంకి గోపాల్ కృష్ణ హితవు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా విధుల్లో చేరిన ఆయుష్ వైద్యులు ప్రజాసేవనే పరమావధిగా భావించి, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాల్ కృష్ణ సూచించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా సేవలందించడంతో పాటు ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎం – NAM) …
Read More »ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ 162.72 కోట్ల చెల్లింపులు
-గడిచిన 4 నెలల్లో ఇప్పటివరకు మొత్తం రూ.1,504 కోట్లు వాటి ఖాతాలకు జమ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.162.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు, ASHA మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయి. …
Read More »రూ. 61 కోట్లతో ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాల కొనుగోలు
-రోగ నిర్ధారణ సామర్ధ్యం పెంపు, తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్య రక్షణ, ఎమెర్జెన్సీ సేవల పటిష్టత లక్ష్యం -20 కేటగిరీల్లో 582 పరికరాల కొనుగోలుకు ఆమోదం -సమకూరనున్న 235 ఐసియూ వెంటిలేటర్లు, క్షయ వ్యాధి నిర్ఱారణకు 100 పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు -కొనుగోలుకు బియఫ్సి ఆమోదం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా వైద్యారోగ్య శాఖ రూ.61 కోట్ల వ్యయంతో వివిధ వైద్య పరికరాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. వ్యాధి నిర్ధారణ సామర్ధ్యాన్ని పెంచేందుకు, …
Read More »డిల్లీకి చెందిన ప్రముఖ ఐఎఎస్ బోధనా సంస్థ వజీరమ్ అండ్ రవి ఐఎఎస్ సంస్థ తో కెఎల్ యు అవగాహనా ఒప్పందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉన్నత విద్యారంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన విజయవాడ, కె.ఎల్. యూనివర్సిటీ-ఢిల్లీలోని ప్రముఖ ఐఎఎస్ బోధనా సంస్థ అయిన వజీరమ్ అండ్ రవి ఐఎఎస్ సంస్థ తో అవగాహనా ఒప్పందన్ని కుదుర్చుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని కెఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ తెలిపారు. శుక్రవారం విజయవాడ లోని కెఎల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు అనేక వందల మంది విద్యార్ధులను ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ …
Read More »వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి…
-ఏపీ వీఆర్ఏ సంక్షేమ సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గ్రామ రెవిన్యూ సహాయకుల (వీఆర్ఏ) సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవిన్యూ సహాయకుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నల్లిపోగు నాగేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మది ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో సుమారు 20,000 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తున్నారని, …
Read More »ఘనంగా ప్రారంభమైన ఐసిఏఐ 58వ ఎస్ ఐఆర్ సి ప్రాంతీయ సదస్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి ఎస్ ఐఆర్ సి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 58వ ప్రాంతీయ సదస్సు దక్ష శుక్రవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వేలాది మంది చార్టర్డ్ అకౌంటెంట్లు విద్యార్థులు పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని సదస్సును ప్రారంభించారు. ఈ …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూఫీ సేవా సదన్ కార్యాలయంలో ఈరోజు గొల్లపూడినందు ముస్లిం మైనారిటీ మత పెద్దలతో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) చిత్రపటానికి పాలాభిషేకం మరియు ప్లే కార్డుల ప్రదర్శన జరిగింది. సూఫీ సేవా సదన్ నిర్వాహకులు రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి, సూఫీ సేవా సదన్ ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ షేక్ మొహమ్మద్ పైజాన్ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీతో నిర్వహించడం జరిగింది. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంట్ సమావేశాల్లో …
Read More »
Prajavartha Online Telugu News