Breaking News

Monthly Archives: August 2026

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి స్పందించాలి

– ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల ప‌రిష్కారం వైపు అడుగులు వేయాలి – పీఆర్‌సీ క‌మిష‌న్‌ను నియ‌మించి, ఐఆర్‌ను ప్ర‌క‌టించాలి – పెండింగ్ డీఏల‌ను త‌క్ష‌ణ‌మే మంజూరు చేయాలి – ఏపీ జేఏసీ నేత‌లు ఎ.విద్యాసాగర్, కె.ఎస్.ఎస్.ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే చొరవ చూపాలని, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఎ. …

Read More »

సనాతన ధర్మాన్ని రాజకీయ పరిహాసానికి వేదిక చేయొద్దు… : లింగమనేని రమేశ్, ఎంపీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పరమత సహనంతో మెలిగే సనాతన ధర్మాన్ని హేళన చేయడం కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలకు పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పవిత్రమైన పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష ఎంపీలు శుక్రవారం సాధువుల వేషధారణతో చేసిన హేళన అత్యంత ఆక్షేపణీయం. సనాతన ధర్మం, పూజ్య సాధు-సంతులు, హిందూ సమాజం మనోభావాలను కించపరచేలా వీధి నాటకాలు ప్రదర్శించి యావత్ హిందూ సమాజాన్ని అవమానించారు. స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీకి …

Read More »

ప్రాణం కోసం 5,839 మంది ఎదురుచూపు!

-బ్రెయిన్ డెడ్ దాతలే వేలాది మందికి ఆశాకిరణం -దేశంలో ఆరో స్థానానికి ఏపీ.. గత ఏడాది 93 మంది దాతలతో 301 అవయవ మార్పిడులు -ఈ ఏడాది ఇప్పటివరకు 56 మంది నుంచి అవయవాల సేకరణ -ఆగస్టు 3 అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం చర్చించాలి -మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పిలుపు -రేపు జీవన్ ధాన్ ఆధ్వర్యంలో వైజాగ్ లో ప్రత్యేక కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం వేలాది మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. జీవన్‌దాన్‌ …

Read More »

భోగాపురం’ బాబు విజన్.. వైకాపాది జగన్నాటకం!

-చరిత్రను అబద్ధాలతో మార్చలేరు జగన్!! -ఐదేళ్లు అడ్డుపడి… ఇప్పుడు క్రెడిట్ కోసం దుష్ప్రచారo చేస్తారా! -పనులు నిలిపేసి.. ప్రారoభ ఘనత మాదేనని ఎలా అంటారు? -శంకుస్థాపనలతో కాలక్షేపం చేసిన వైకాపాకు బోగాపురం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజo అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టును అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని ఉత్తరాంధ్ర అభివృద్ధికి తీవ్ర అన్యాయం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇప్పుడు …

Read More »

అమరావతి రైతులకు 109 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తుళ్లూరు, నేలపాడు, రాయపూడి, బోరుపాలెం, లింగాయపాలెం, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులకు శనివారం 2026 ఆగస్టు 1న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 109 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది..అట్టి ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారి తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి..అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ …

Read More »

రాష్ట్రంలోనే తొలి ఉచిత 2డీ ఎకో స్కానింగ్ కేంద్రం ఏర్పాటు..

-తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణకు కీలక అడుగు -లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి -550 మంది గర్భిణీలకు ఉచిత అత్యాధునిక గుండె పరీక్షలు -ముందస్తు గుర్తింపుతో మాతా,శిశు మరణాల నివారణే లక్ష్యంగా పశ్చిమ ప్రజా ఆరోగ్య రంగంలో రాష్ట్రానికి ఆదర్శం.. -ఆదర్శ నియోజకవర్గంగా పశ్చిమ.. -రాజకీయాలకు అతీతంగా సేవలు.. -డిమాండ్ చేసి పనులు చేపించుకోండి.. -ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువుల ఆరోగ్య సంరక్షణలో మరో వినూత్న అడుగు పడింది. విజయవాడ పశ్చిమ …

Read More »

కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వకపోతే ఉద్యమిస్తాం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా డెల్టాలో వరి పంటకు తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలను రక్షించాలని రైతునేతలు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకాలంలో సాగునీరివ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు .కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని వరి సాగు చేస్తున్న రైతాంగాన్ని ముఖ్యంగా 90% పైగా ఉన్న కౌలు రైతులను ప్రభుత్వం తీవ్ర గందరగోళంలోకి నెట్టి వేసిందని, మే 1 నాటికి ఖరీఫ్ సీజన్ ప్రారంభించి నీళ్లు ఇస్తామని, …

Read More »