విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా మేము స్వయంగా వండి వడ్డంచే ఈ కార్యక్రమం అనేకమంది ఆకలి తీర్చడానికి మేము చేసే ఈ సేవలో అనేకమంది మంచి మనసున్న గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మేము చేసే అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదానంగా …
Read More »Tag Archives: vijayawada
మెరుగైన ఫలితాలతో ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట పెంచిన 6 గురు విద్యార్థులకు రూ.5,000 వేల చొప్పున బహుమానం అందజేసిన MLA బొండా ఉమామహేశ్వరరావు
-ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభకు MLA బొండా ఉమామహేశ్వరరావు పూల మాల వేసి ఘన సన్మానం చేసి, విద్యార్థులకు కాలేజ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, స్వీట్స్ ను తన సొంత నిధులతో అందజేశారు -586 మార్కులతో న్యూ రాజరాజేశ్వరి పేట విద్యార్థిని ద్రాక్షాయణి రికార్డు సృష్టి MLA బొండా ఉమామహేశ్వరరావు 10,000 వేల రూపాయల బహుమానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద మంగళవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా …
Read More »పెన్షన్ అందని పేదలకు తన సొంత నిధులతో ప్రతినెలా రూ.4000 పెన్షన్ పంపిణీ చేస్తున్న MLA బొండా ఉమామహేశ్వరరావు
-బొండా కుటుంబం సేవలు మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు మంగళవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మరోసారి తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 14 మంది కి ప్రతీ నెల రూ.4000 రూపాయలు పెన్షన్ నగదును అందజేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగా ప్రభుత్వం నుండి అందవలసిన పెన్షన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను గుర్తించి, వారికి అండగా …
Read More »వేసవిలో పశువులకు వరంగా నీటి తొట్టెలు
-క్షేత్రస్థాయిలో తొట్టెలను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో పశు జీవాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీటి తొట్టెల ద్వారా పశుపోషకులకు ఎంతో మేలు జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఎ.కొండూరు మండలంలోని వెస్ట్ మాధవరంలో పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి తనిఖీల్లో భాగంగా నీటి తొట్టెలను పరిశీలించారు. తొట్టెలకు స్వచ్ఛమైన నీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదా అనే అంశాన్ని సమీక్షించారు. యూనిట్ విలువ రూ. …
Read More »కాకులపాడు బీరయ్యస్వామి ఆలయ పునఃప్రతిష్ఠకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కు ఆహ్వానం
-మే 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు -విజయవాడ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలసి ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ కమిటీ సభ్యులు -భక్తులకు ఇబ్బందులు లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచన -భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో నూతనంగా పునఃనిర్మించిన శ్రీ కామావతి సమేత బీరయ్యస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కు …
Read More »ఎస్సీ కుటుంబాల సమీకృత ఆర్థిక అభివృద్ధి సమష్టి కృష్టి
– శిక్షణ, రుణం, మార్కెట్ సహాయంతో ప్రగతి దిశగా పయనం – తొలి దశలో నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో ఐఈడీపీ – దశల వారీగా అన్ని మండలాల్లోనూ అమలుకు కసరత్తు – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎన్ఎస్ఎఫ్డీసీ సీజీఎం సి.రమేష్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కుటుంబాల సమీకృత ఆర్థిక అభివృద్ధికి సమష్టిగా కృషిచేయడం జరుగుతోందని.. సమీకృత ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం (ఐఈడీపీ) ద్వారా ముఖ్యంగా ఎస్సీ కుటుంబాల సమగ్ర ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కార్యక్రమాలు …
Read More »భవానీపురం ఎన్డీఏ కార్యాలయం వద్ద బిజెపి విజయోత్సవం…
-మూడు రాష్ట్రాల్లో బీజేపీ అఖండ విజయంతో సుజనా చౌదరి కార్యాలయం వద్ద ధూమ్ ధాం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించడంతో విజయవాడలో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాలను అంటుంటున్నాయి. మంగళవారం భవానీపురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం వద్ద ఎపి బిజెపి అధ్యక్షులు పివియన్ మాధవ్ ఆధ్వర్యంలో ధూమ్ ధాం నిర్వహించారు. మాధవ్ తో పాటు ఇతర నాయకులు తీన్ మార్ వాయించి సందడి చేశారు.. అక్కడి నుంచి జాతీయ రహదారి …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. నియోజకవర్గానికి చెందిన వేముపాటి విజయలక్ష్మి కి వెన్ను సర్జరీ కోసం 2,24,000/- రూపాయలు, కొల్లిపర వెంకట పద్మావతి తుంటి మార్పిడి చికిత్సకు 7,00,000/- రూపాయలు, పబ్బిశెట్టి శ్రీనివాస్ గుండె శస్త్ర చికిత్సకు 5,00,000/- రూపాయలు, వడ్లమూడి శ్రీనివాస్ కు 2,00,000/- రూపాయలు, దమ్ము జయ కు 65,000/- రూపాయలకు ఎల్వోసీ లు అందచేశారు.. మంగళవారం …
Read More »మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం మీకేం కావాలన్నా నాకు చెప్పండి..
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన పారిశుధ్య నిర్వహణ కొరకు మీకేం కావాలన్నా నేరుగా తమకే తెలియ చేయవచ్చని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పారిశుద్ధ్య కార్మికురాలితో అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా అజిత్ సింగ్ నగర్, సత్యనారాయణపురం, సుందరయ్య నగర్ కట్ట, ఉడా కాలనీ, ఫైర్ స్టేషన్ రోడ్, నూజివీడు రోడ్, అయోధ్య నగర్, మామిడికాయ పాకలు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు. ముందుగా సత్యనారాయణ పురం, …
Read More »అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) రాబట్టుటకు కన్సల్టెన్సు తో సమావేశం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ రాబట్టుటకు కన్సల్టెంట్స్ తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ లో భాగంగా నగరాభివృద్ధికి వచ్చే 15 సంవత్సరాలకు సరిపడా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ప్రణాళికలను ఇంజనీరింగ్ సిబ్బంది డి పి ఆర్ లు సిద్ధం చేయగా, దానికి ఖర్చయ్యే …
Read More »
Prajavartha Online Telugu News