విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1 పరిధిలో జోనల్ కమిషనర్ గా సేవలందిచిన రమ్య కీర్తన నరసరావుపేటలోని మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం చే నియమితులై నందున, సర్కిల్ 1 పరిధి లో రమ్యకీర్తన అందించిన సేవలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి. చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి.సత్యకుమారి, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News