Breaking News

Tag Archives: vijayawada

మీ ఇంటి నుంచే ఇంటి వివ‌రాలు న‌మోదు చేయండి

– స్వీయ గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములుకండి – అందుబాటులో https://se.census.gov.in పోర్ట‌ల్ – జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో మొట్ట‌మొద‌టి డిజిట‌ల్ జ‌న గ‌ణ‌న తొలిద‌శ‌లో భాగంగా ప్రారంభ‌మైన స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ – ఎస్ఈ)లో ప్ర‌జ‌లు ఉత్సాహంగా పాల్గొని త‌మ ఇంటి నుంచే స‌మాచారాన్ని న‌మోదు చేయాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ కోరారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వ‌ర‌కు స్వీయ గ‌ణ‌న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ …

Read More »

విజయవాడ నగర అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

– జిల్లా కలెక్టర్, విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్, విజయవాడ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి. లక్ష్మీశ గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా నగరంలోని మినీ ఎస్టిపిల పురోగతి, డివిజన్ల పెంపు, జనగణన శిక్షణ కార్యక్రమాలపై …

Read More »

అందరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో పాల్గొనండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అందరూ స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) లో పాల్గొనాలని అదనపు కమిషనర్ మరియు సిటీ సెన్సెస్ ఆఫీసర్ ఏ. రవీంద్రరావు అన్నారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సెల్ఫ్ అన్యుమరేషన్ చేసి అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ ఏ. రవీంద్రరావు మాట్లాడుతూ నగర పరిధిలోగల మూడు నియోజకవర్గాలలోని శాసనసభ్యులు జన గణన లో పాల్గొనారని అన్నారు. జన గణన ఎంతో ముఖ్యమైన అంశమని ప్రజలందరూ జనాభా లెక్కల్లో పాల్గొని దేశాభివృద్ధికి …

Read More »

రోడ్డు ప్రమాదాల నిరోధానికి సమిష్టి కృషి అవసరం!

-పీఎం-రాహత్ పథకం అమలుతో క్షతగాత్రుల ప్రాణాలకు భరోసా! -రూ.1.5 లక్షల ఉచిత నగదు రహిత వైద్య సేవలు! -ప్రమాదంపై సమాచారమిచ్చిన వారికి రూ.25 వేల ప్రోత్సాహక నగదు! -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీసు శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన …

Read More »

డీలిమిటేషన్ బిల్లును చంద్రబాబు, జగన్, పవన్ వ్యతిరేకించాలి

-మహిళా బిల్లు కోసం 1952 నుంచే సీపీఐ ఎంపీల పోరాటం -మహిళా బిల్లు ముసుగులో మోదీ కీలక బిల్లుల ఆమోదానికి కుట్ర -డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు..విస ్తతమైన చర్చ జరగాలి. -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చూకూర్చేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని, ఆ దిశగా టీడీపీ, జనసేన, వైసీపీ ఎంపీలతో …

Read More »

యుద్ధం వద్దు-శాంతి ముద్దు!

– శాంతి కోసం విజయవాడ వీధుల్లో గళమెత్తిన ప్రజలు – శాంతి నినాదాలతో నినాదాలతో ఐక్యంగా ముందుకొచ్చిన వివిధ వర్గాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి కోసం విజయవాడ నగరం మరోసారి ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పీస్ ఫోరం విజయవాడ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన శాంతి ర్యాలీ ప్రజలలో శాంతి ఆకాంక్షను స్పష్టంగా ప్రతిబింబించింది. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఉక్రెయిన్ -రష్యావర్ యుద్ధం ,మధ్యప్రాచ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల …

Read More »

ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ సృష్టికర్త, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డా. అంబేద్కర్  పాత్ర విశిష్టమని, సమానత్వం, సామాజిక న్యాయం సాధనలో ఆయన …

Read More »

మాన‌వ‌తా వాది.. గొప్ప సంఘ సంస్క‌ర్త డా. బీఆర్ అంబేద్క‌ర్‌

– ఆయ‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా అభివృద్ధి దిశ‌గా అడుగులు – స‌మాజంలోని అన్ని వ‌ర్గాల అభ్యున్న‌తికి ప్ర‌భుత్వం కృషి – రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి – విజ‌య‌వాడ‌లో ఘ‌నంగా రాష్ట్ర‌స్థాయి డా. బీఆర్ అంబేద్క‌ర్ 135వ జ‌యంతి మ‌హోత్స‌వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛా విలువల స్థాపించడానికి చేసిన కృషి అపారమని, అంబేద్కర్ గారి ఆశయాలు ప్రతి …

Read More »

డా. బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాలు.. అభివృద్ధికి దారిదీపాలు

– మ‌హ‌నీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ గారి ఆశయాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకాల‌ని.. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం, విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత దేశ ప్రగతికి బలమైన పునాది అని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ, శాస‌న‌స‌భ్యులు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. మంగ‌ళ‌వారం న‌వ భార‌త రాజ్యాంగ నిర్మాత‌-భార‌త ర‌త్న బాబా సాహెబ్ డా. …

Read More »

నిరాశ్రయులకు అవగాహన కల్పించిన రూట్స్ ఫౌండేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరానికి వలస వచ్చి నీడ లేని నిరాశ్రయులకు, పుట్ పాత్ ల మీద, డివైడర్ ల మీద, బ్యారేజ్ మీద నిద్రించే నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు నగర మునిసిపల్ కార్పొరేషన్ 6 ప్రదేశాలలో నిరాశ్రయ వసతి గృహాలు ఏర్పాటు చేసిందని దీనిలో ఉచిత ఆశ్రయం, బెడ్, బాత్రూం సౌకర్యాలు ఉన్నాయని రోడ్ ల మీద ఉండకుండా వీటిని ఉపయోగించుకోవాలని రూట్స్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. పోలవరపు విజయభాస్కర్ కోరారు. 13వ తేదీ రాత్రి రైల్వే స్టేషన్, బ్యారేజ్ …

Read More »