– ఈ సందర్శనను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 10న ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, బీసీ …
Read More »Tag Archives: vijayawada
షా బుఖారి దర్గాను సందర్శించిన సుప్రీం కోర్టు ప్యానల్ కౌన్సిల్ సభ్యులు చిరుమామిళ్ల క్రాంతి కుమార్
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా వారి దర్గాను సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే ప్యానల్ కౌన్సిల్ సభ్యులు చిరుమామిళ్ల క్రాంతి కుమార్ ఈరోజు షా బుఖారి బాబా సందర్శించారు. దర్గాకు విచ్చేసిన ఆయనకు షా బుఖారి లంగర్ ఖానా నిర్వాహకులు మొహమ్మద్ అల్తాఫ్ బాబా ఘనస్వాగతం పలికారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం చిరుమామిళ్ల క్రాంతి కుమార్ ని ఘనంగా సన్మానించారు. అనంతరం …
Read More »ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమ బాట పడతాం…
-ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో ఏపీఎస్ …
Read More »నారా లోకేష్ విజన్తో ఏపీకి పారిశ్రామిక పునర్వైభవం!- ఎంపీ చిన్ని
-“లోకేష్ చొరవతో ప్రపంచ దిగ్గజాల చూపు ఆంధ్రప్రదేశ్ వైపు!” -“రాయల్ ఎన్ఫీల్డ్ రాకకు కారణం పెట్టుబడిదారులకు కల్పించిన విశ్వాస వాతావరణం!” -“యువతకు ఉద్యోగాలు… రాష్ట్రానికి పెట్టుబడులు… లోకేష్ నాయకత్వంలో ఏపీకి కొత్త దిశ!” -విజయవాడ భవానిపురం లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ను సందర్శించిన ఎంపీ చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో గల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్ ఎండీ తేజ ఎంపీకి ఘన …
Read More »కార్యకర్తల కష్టమే పార్టీకి బలం!…వియాజయనికి మూలస్థంభం కార్యకర్తల కష్టం
-“కార్యకర్తల అభిప్రాయాలే పార్టీకి దిశానిర్దేశం… రాష్ట్ర అభివృద్ధే అంతిమ లక్ష్యం” -“వీరులపాడు టీడీపీ శ్రేణులతో ఎంపీ కేశినేని చిన్ని ఆత్మీయ మమేకం” -“ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ… పార్టీ బలోపేతమే ధ్యేయం” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ప్రతినిధిగా రెండేళ్ల సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మరోసారి పార్టీ కేడర్తో తన అనుబంధాన్ని చాటుకున్నారు. అధికార పదవిలో ఉన్నప్పటికీ కార్యకర్తల మధ్యే ఉంటూ వారి అభిప్రాయాలకు విలువనిచ్చే నాయకుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ, నందిగామ …
Read More »అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ చర్యలు పాటించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆదేశాల మేరకు వీఎంసీ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఎం.జి.రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్లో ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా భవనంలో పలు కీలక అగ్నిమాపక భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. భవనంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక భద్రతా పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఇనుప షీట్లతో పూర్తిగా మూసివేయబడి ఉండటంతో అవి …
Read More »నీటి నిల్వల నివారణకు మేజర్ ఔట్ఫాల్ డ్రైన్లలో విస్తృతంగా గుర్రపుడెక్కల తొలగింపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లలో గుర్రపుడెక్కల తొలగింపు పనులను విస్తృతంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్లోని కండ్రిక జంక్షన్ వద్ద ఉన్న మేజర్ అవుట్ఫాల్ డ్రైన్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు మరియు చీఫ్ ఇంజనీర్ (ఇన్చార్జ్) పి. సత్యకుమారి మార్గదర్శకత్వంలో నగరపాలక సంస్థ …
Read More »ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, …
Read More »ఉచిత యోగా శిక్షణతో యోగాంధ్ర 2026
-నగర ప్రజలకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర – ఆరోగ్యాంధ్ర 2026” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నగర పరిధిలోని కందుకూరు కళ్యాణ మండపం, బర్మ్ పార్క్ ప్రాంతం మరియు అంబేద్కర్ స్మృతి వనం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు బిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుల ఆధ్వర్యంలో కామన్ యోగ ప్రోటోకాల్ …
Read More »పశు సంపదతో గ్రామాల్లో సుస్థిర సంపద
– అన్నదాతలకు అదనపు ఆదాయానికి వీలు – పాడి పశువుల్లో పునరుత్పత్తిపై ప్రత్యేక దృష్టి – పశువుల ఉత్పాదకత పెంపునకు కార్యాచరణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి పశుసంపద కీలకమని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థిరమైన పాల ఉత్పత్తి ద్వారా రైతుల ఆదాయాన్ని సుస్థిరం చేసేందుకు పశు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ విధానంపై …
Read More »
Prajavartha Online Telugu News