మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చీమలపాడు లోని బాబా గారి దర్గా ను మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు వారి సతీమణి శీరిష సందర్శించి ప్రతేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్నికల ప్రచార పర్వం పూర్తికాగా శనివారం రాత్రి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు శీరిష దంపతులు చీమలపాడు లోని బాబా గారి దుర్గా ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా బాబా గారి కుటుంబ సభ్యులు, మత పెద్దలు ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి దంపతులకు అత్మీయ స్వాగతం పలికి బాబా గారి దర్గా వద్ద ప్రతేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం రెడ్డిగూడెం మండల తెలుగుదేశం నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News