-పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో వారాహి విజయభేరీ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ‘సిద్ధం పేరిట కేవలం ప్రచార హోర్డింగులకే రూ.600 కోట్లు ప్రజాధనం లూటీ చేసిన జగన్ పేదవాడు… ఒక్క ఎమ్మెల్యే లేకుండానే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆదుకున్న నేను పెత్తందారుడినా..? మద్యం అమ్మకాల్లో డిజిటల్ కరెన్సీ లేకుండా చేసి రూ.20 వేల కోట్లు జేబులో వేసుకున్న వైసీపీ నాయకుడు పేదవాడు.. అయిదేళ్లు అధికారం లేకున్నా ప్రజల తరఫున పోరాడిన నేను పెత్తందారుడినా..? జేపీ …
Read More »Telangana
అసోసియేషన్ ఆఫ్ అలైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225 సౌత్ విజయవాడ వారి ఆధ్వర్యంలో అన్న వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లేనివారికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతోనే అసోసియేషన్ ఆఫ్ అలైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 225 సౌత్ విజయవాడ అలెన్స్ క్లబ్ ఆఫ్ రమాదేవి క్లబ్ అధ్యక్షురాలు అలై ఎం శోభ రాణి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు, శుక్రవారం క్లబ్ సభ్యులు కటకం సతీష్ కుమారుడు సాత్విక్ సాయిరాం పుట్టినరోజు సందర్భంగా గుణదల ఆపిల్ సొసైటీ లో ఈ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిస్టిక్ పి …
Read More »అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కు దరఖాస్తు స్టైలిష్ స్టార్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : పుష్ప షూటింగ్లో బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చారు. విదేశాల్లో డ్రైవింగ్ చేసేందుకు వీలుగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కు దరఖాస్తు చేశారు. ఫారమ్ 4ఏ సమర్పించడంతో పాటు, లైసెన్స్ అనుమతి కోసం నిర్ణీత రుసుం చెల్లించి ప్రక్రియలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా స్టైలిష్ స్టార్ పొడవాటి గడ్డం, జుట్టుతో కనిపించారు.
Read More »తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తప్పదా? బీజేపీలోకి ఆ నేత జంప్!
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఖమ్మం రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ నెల 22న జరగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి రెండు లోక్సభ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. అవి ఖమ్మం, వరంగల్. ఇప్పటికే అరూరి రమేష్కి వరంగల్ టిక్కెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానంపై తేల్చుకోలేని స్థితిలో …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కస్టడీలో పుస్తకాలే నేస్తాలు
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆమె ఈడీ కస్టడీ మార్చి 23 వరకు కొనసాగుతుంది. కస్టడీలో ఉన్న రోజు ఈడీ అధికారులు కవితను కొంతసేపు ప్రశ్నించారు. తరువాత, పుస్తకాలు చదువుతూ సమయాన్ని వెచ్చిస్తున్నారు. నిన్న, బుధవారం ఏకాదశి సందర్భంగా ఆమె ఉపవాసం ఉన్నారని తెలుస్తోంది. అందుకే కవిత కోసం పళ్లను ఈడీ అధికారులు అందచేశారని చెబుతున్నారు. పుస్తకాలే నేస్తాలు.. కస్టడీలో ఉన్న కవిత ఎక్కువ సమయం పుస్తకాలు …
Read More »నగరంలో కుబేరా సిల్వర్ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికైనదనే నమ్మకాన్ని ఇచ్చే కుబేరా సిల్వర్ షోరూం ప్రారంభించబడింది. బుధవారం ఎంజిరోడ్డులోని బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రక్కన కుబేరా సిల్వర్ షోరూంను నిర్వాహకులు ఊరా సాయి నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఊరా సాయి మాట్లాడుతూ ఈ రంగంలో ఎంతో అనుభవం కలిగి కుబేరా సిల్వర్ షోరూంను నగరంలో ప్రజలకు చేరువుగా ఎంజిరోడ్డులో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఆధునాతన సరికొత్త మోడల్స్లో వెండి వస్తువులు, ఆభరణాలను అతి తక్కువ ధరలలో …
Read More »డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లపై దృష్టి
– సమన్వయ శాఖల అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఆర్డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్వో) బీహెచ్ భవానీ శంకర్ బుధవారం నియోజకవర్గానికి సంబంధించి సజావుగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో కలిసి ఎన్ఎస్ఎం స్కూల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, నిమ్రా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ రిసెప్షన్ సెంటర్లకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఎలక్షన్ కమిషన్ …
Read More »ఘనంగా కాంగ్రెస్ నాయకులు వి.గురునాధం జన్మదిన వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది వి.గురునాధం గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి అడ్మిన్ జనరల్ సెక్రెటరీ ఎస్.ఎన్.రాజా ముఖ్యఅతిథిగా పాల్గొనగా డాక్టర్ శాస్త్రి జంధ్యాల, ఎస్కే.అన్సారి, …
Read More »తెలంగాణ కొత్త గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇదీ రాధాకృష్ణన్ నేపథ్యం.. రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు లోక్ …
Read More »ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. అతనికి బెయిల్!
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద ముందడుగు పడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్తో పాటు ట్రయల్ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని… ఆ తర్వాతే హైదరాబాద్ వెళ్లాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, అభిషేక్ను విదేశాలకు వెళ్లవద్దని.. పాస్పోర్టును అప్పగించాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. …
Read More »
Prajavartha Online Telugu News