Breaking News
Praveen Kumar

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం.. అతనికి బెయిల్!

హైదరాబాద్‌, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ మద్యం కుంభకోణంలో పెద్ద ముందడుగు పడింది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అభిషేక్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి ఐదు వారాల షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్‌తో పాటు ట్రయల్‌ కోర్టు అనుమతి కూడా తీసుకోవాలని… ఆ తర్వాతే హైదరాబాద్‌ వెళ్లాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, అభిషేక్‌ను విదేశాలకు వెళ్లవద్దని.. పాస్‌పోర్టును అప్పగించాలని ఆదేశించింది. అభిషేక్ భార్యకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున కోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

అక్టోబర్ 9, 2022న హైదరాబాద్‌కు చెందిన బోయినపల్లి అభిషేక్‌రావును ఇడి అధికారులు అరెస్టు చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న అభిషేక్ రావు అరెస్ట్ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కాగా, గతంలో అరెస్టయిన విజయ్‌ నాయర్‌ వాంగ్మూలం మేరకు సీబీఐ అధికారులు బోయిన్‌పల్లి అభిషేక్‌రావును హైదరాబాద్‌లో అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం(Liquor Scam)లో అభిషేక్‌రావు కీలక పాత్ర పోషించినట్లు సీబీఐ విచారణలో తేలింది. సౌత్ లాబీ తరపున అభిషేక్ రావు లావాదేవీలు కొనసాగించినట్లు తేలిందని సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో దినేష్ అరోరాతో పాటు ఇండో స్పిరిట్ యజమాని విజయ్ నాయర్ సూత్రధారులుగా అధికారులు గుర్తించారు. వసూలు చేసిన సొమ్ములో రూ.3.8 కోట్లు హవాలా రూపంలో బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. సమీర్ మహేంద్రకు అభిషేక్ హవాలా రూపంలో డబ్బు బదిలీ చేసినట్లు తేలింది.

కవిత మరో విన్నపం..
మరోవైపు ఢిల్లీ లిక్కర్‌ కేసు(Liquor Scam)లో నిందితురాలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తన అరెస్ట్‌ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలని కవిత తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో కోరారు. కవితను ఈడీ కస్టడీ నుంచి విడుదల చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది వెళ్లి ఎమ్మెల్సీ కవితను కలిశారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన కవిత ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

కుటుంబ సభ్యులను కలవడం మంచిది..
మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో అరెస్టయి ఎనిమిది రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత రూస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుకు, తన తల్లితో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులతో కలిసేందుకు అనుమతించారు. శనివారం కవితతో మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావు భేటీ అయినట్లు సమాచారం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *