తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 9న గరుడ పంచమి ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి …
Read More »Daily Archives: August 3, 2024
నగరంలో ఘనంగా కాకాని వెంకటరత్నం 124వ జయంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 124వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం, బెంజిసర్కిల్ సమీపంలోని స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 124వ జయంతి కార్యక్రమాన్ని బెంజిసర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహం వద్ద ఆయన మనవడు తరుణ్ కాకాని ఆధ్వర్యంలో విగ్రహనికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేశం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం …
Read More »శ్రీసిటీ తరహాలో ఇండస్ట్రియల్ జోన్లను తయారుచేయాలి
-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ -ఏపీఐఐసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి -సమావేశంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ సెక్రటరీ ఎన్. యువరాజు, కమిషనర్ శ్రీధర్ -ఇండస్ట్రియల్ జోన్లలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్న మంత్రి టి.జి భరత్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ జోన్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. …
Read More »చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు ఉండవ్
-అందరికీ ఉపాధి కల్పనే మా ధ్యేయం -రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ఏటా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్నదే ధ్యేయం -నిరక్షరాస్యులకు సైతం ప్రభుత్వ సబ్సిడీతో కూడిన రుణాలు -యూనిట్ల ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అవగాహన కార్యక్రమాలు -యూనిట్ల సద్వినియోగానికి జిల్లాకో ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, అందరికీ ఉపాధి …
Read More »గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు.. త్వరలో కొత్త చట్టం..
-చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి.. -కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు.. -సహకార వ్యవస్థలో ఈ-కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు.. -నేటి నుంచే వ్యవస్థలో మార్పు రావాలి.. లోపాలు సరిదిద్దాలి.. -సహకార సంఘాల్లో అవినీతి జరిగిందని వస్తున్న వార్తలపై విచారణ.. -ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభం.. -కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార …
Read More »రూ. 3.23 కోట్ల ఉద్యాన పంటల రాయితీ విడుదల
– జిల్లా కలెక్టర్ ఆమోదంతో నేరుగా ఉద్యాన రైతుల ఖాతాల్లో జమ – జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో 2,387 మంది రైతులకు రూ. 3.23 కోట్ల మేర వివిధ ఉద్యాన పథకాల (2023-34)కు సంబంధించి మొదటి విడతగా రూ. 3.23 కోట్లు ప్రభుత్వ రాయితీ విడుదలైందని.. జిల్లా కలెక్టర్ ఆమోదంతో రైతుల ఖాతాల్లో ఈ రాయితీ మొత్తాన్ని నేరుగా జమచేయడం జరుగుతోందని జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ తెలిపారు. ఈ …
Read More »బిందు సేద్యానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిందు సేద్యానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎంఐపి పథక సంచాలకులు పీ.ఎం సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ మరియు సింక్టర్లలకు ఆరువేల హెక్టార్లు లక్షంగా నిర్దేశించారన్నారు. ఇందుకు 19.82 కోట్ల రాయితీని కేటాయించడమైనదని ఆయన తెలిపారు. మెట్ట మరియు మాగాణి ఏదైనా 5 ఎకరాలలోపు 90% రాయితీ (రు.2.18 లక్షల వరకు), 5 నుండి 12.50 ఎకరాలలోపు 50% రాయితీ (రు.3.10 లక్షల వరకు) ఇవ్వటం …
Read More »సకాలంలో నిత్యావసర సరుకులు అందించేలా అన్ని చర్యలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండియు ఆపరేటర్లు కార్డుదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ఆదేశించారు .జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ నిధి మీనా శనివారం స్థానిక సింగ్ నగర్ వద్ద మొబైల్ డిస్పెర్సింగ్ వెహికల్ (ఎండియు) ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు . ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు …
Read More »గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరింత ఉత్తమ ఫలితాలను సాధించండి..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన ఆశ్రమ పాఠశాలల ద్వారా గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోదనను అందించి రానున్న విద్యా సంవత్సరంలో నూరు శాతం ఉత్తమ ఫలితాలను సాధించేలా కృషి చేయాలని ఎ కొండూరు గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన సూచించారు. ఎ కొండూరు పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు శనివారం జిల్లా కలెక్టర్ జి. సృజన, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జె. సునీతతో …
Read More »ప్రభుత్వ చేయూతతో గిరిజనులకు సొంతింటి కల నేరవేరింది..
-జిల్లా కలెక్టర్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన లబ్దిదారులు ఇళ్ళ కేటాయింపులో చెల్లించాల్సిన వాటాను ప్రభుత్వమే చెల్లించి సొంతింటి కలను నేరవేర్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.జి. సృజన తెలిపారు. జెఎన్ఎన్యుఆర్యం పథకం కింద ఇంటిని కేచాయించేందుకు లబ్దిదారులు చెల్లించాల్సిన వాటా కింద గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహయాన్ని శనివారం కలెక్టర్ జి. సృజన, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి జె. సునీతలు కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్ నందు లబ్దిదారులకు …
Read More »
Prajavartha Online Telugu News